ప్రశాంత్ నీల్..యష్ హీరోగా నటించిన కేజీఎఫ్ చాప్టర్- 1 సినిమాతో ఓవర్ నైట్ స్టార్ డైరెక్టర్ అయిపోయాడు. ఆ సినిమా తో హీరోగా యష్ కి పాన్ ఇండియన్ స్టార్ గా క్రేజ్ వచ్చింది. ఇప్పుడు ఇదే కాంబినేషన్ లో కేజీఎఫ్ చాప్టర్- 2 రూపొందుతుంది. ఇక కేజీఎఫ్ చాప్టర్- 1, 2 ల మేకింగ్.. అలాగే ప్రషాంత్ నీల్ టాలెంట్ చూసి టాలీవుడ్ స్టార్స్ ప్రభాస్, ఎన్.టి.ఆర్, మహేష్ బాబు లాంటి వాళ్ళు ప్రశాంత్ నీల్ తో సినిమా చేయాలని ఆరాట పడుతున్నారు.
ఇప్పటికే ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ కాంబినేషన్ లో ఓ భారీ యాక్షన్ డ్రామా తెరకెక్కించనున్నాడని తెలుస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాని భారీ బడ్జెట్ నిర్మించనున్నారు. ఇప్పటికే ఈ నిర్మాణ సంస్థలో ఇద్దరి డేట్స్ లాకయి ఉండటంతో ఈ కాంబినేషన్ లో భారీ సినిమాని నిర్మించాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇక ప్రశాంత్ నీల్ ఈ సినిమాని పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించనున్నాడన్న వార్త వచ్చింది. అలాగే తారక్ ని మాఫియా డాన్స్ గా చూపించబోతున్నాడన్న ప్రచారమూ జరుగుతోంది.
ఇక ఈ సినిమాని పాన్ – ఇండియా స్థాయిలో దాదాపు 250 కోట్ల బడ్జెట్లో నిర్మించనున్నారట. ఇక ఈ సినిమా కోసం ఎన్టీఆర్ దాదాపు బల్క్ డేట్స్ కేటాయిస్తున్నారట. 2022లో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ 2023 చివరిలో లేదా 2024 ప్రథమార్థం లో రిలీజ్ అయ్యే అవకాశాలున్నాయని అంటున్నారు. ప్రస్తుతం ఎన్.టి.ఆర్ రాజమౌళి దర్శకత్వంలో ఆర్ ఆర్ ఆర్ లో కొమరం భీం గా కనిపించనున్నాడు. ఆ తర్వాత మాటల మాంత్రీకుడు త్రివిక్రం శ్రీనివాస్ దర్శకత్వంలో 30 వ సినిమాని చేయనున్నాడు.
అంతేకాదు ప్రభాస్ తోను ప్రశాంత్ నీల్ సినిమా చేస్తాడని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ప్రభాస్ మూడు భారీ పాన్ ఇండియన్ సినిమాలు చేస్తున్నాడు. ఈ సినిమాలు కంప్లీటవడానికే 2023 వచ్చేస్తుందని అంటున్నారు. ఈ సినిమాల తర్వాత ప్రశాంత్ నీల్ తో ప్రభాస్ సినిమా చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమా ప్రకటన ప్రబాస్ బర్త్ డే అయిన అక్టోబర్ 23 న వచ్చే అవకాశం ఉందని సమాచారం. మొత్తానికి ఒక్క సినిమాతో రాజమౌళి అంత క్రేజ్ తెచ్చుకున్న ప్రశాంత్ నీల్ తో సినిమా చేయడానికి ఎన్.టి.ఆర్, ప్రభాస్ పోటీ పడుతున్నారని చెప్పుకుంటున్నారు.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!