కరోనా ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది. అప్పటి వరకు మంచిగా బతికిన వాళ్ళను రోడ్డున్న పడేసింది. తన జాబ్ తో ఇల్లు నెట్టుకుంటూ వాచ్చే వారు జాబ్ పోవడంతో ఏమి చేయాలో తెలియని స్థితికి వచ్చేశారు. చిన్నా చితక పనులు చేసుకుని పూట గడిపే వారి సంగతులను చెప్పనవసరం లేదు.. కరోనా వచ్చి సచ్చే కంటే ముందే పేదరకం వారిని చంపేస్తాదని కన్నీరు మున్నీరు అయ్యారు. ఏదేమైనాసరే.. అంటూ కరోనా భయానికి ఊరికి బయల్దేరిన వలస కూలీలు.. అక్కడ బతకడం కష్టం అని మళ్ళీ పట్టణాల బాట పట్టారు. అయిన వాళ్ళ ఆర్తనాదాలను విని కరుణించి పనులు ఇచ్చే వక్తులు దొరక్క.. పని దొరికిన రోజు పొట్ట నింపుకునీ.. మిగతా రోజుల్లో పస్తులు ఉంటున్నారు. కరోనా మాట వింటే చిన్నా చితక బతుకుల్లో ఒకరకమైన భయం వస్తుంది. మళ్ళీ మూడు పూటలు ఎప్పుడు తింటామా అని ఆశగా చూస్తుంటారు. ఇక్కడ ఏ మనిషిని స్పృచించినా.. ఇదే బాధ.
ఈ లాక్ డౌన్ లో జాబ్ లు పోగొట్టుకున్న వారు మళ్ళీ జాబ్ ఎలా దేవుడా అని తలలు పట్టుకునే వారు ఒకవైపు ఉంటే.. ఏమైనా చేసి మళ్ళీ లైఫ్ ను కొత్తగా మార్చాలని ప్రయత్నం చేసే వారు ఇంకో వైపు ఉన్నారు. అలా మార్పు కోసం చేసిన ప్రయత్నంతో సక్సెస్ బాట పట్టి మససుంటే మార్గం ఉందని నిరూపిస్తున్నారు.
ఈ విషయాన్ని మళ్ళీ హర్యానాలోని గురుగావ్ కు చెందిన బల్వీర్ సింగ్(47) నిరూపించాడు. ఆయన ఒక హోటల్ లో పని చేసేవాడు. హోటల్ కు సంబంధించిన వెహికల్స్ ను నడిపేవాడు. లాక్ డౌన్ వల్ల తన ఉద్యోగాన్ని పోగొట్టుకున్నాడు. దాంతో ఏమి చేయగలనురా నాయనా అనుకుని నెత్తి పెట్టుకోకుండా.. ఏమి చేస్తే బాగుంటుంది అని ఆలోచించాడు. ముందుగా తన పీఎఫ్ కొద్ది మొత్తని ఇంటి ఖర్చులకు వాడుకున్నాడు. అవి అయిపోగానే తన స్కూటీ పై టిఫిన్స్ అమ్మడాన్ని ప్రారంభించాడు. దానికి అనువుగా స్కూటీ ని రూ. 20 వేలతో మార్పులు చేయించుకున్నాడు. ఇక దాంతో కూరగాయల మార్కెట్ వద్ద టిఫిన్స్ అమ్మడాన్ని ప్రారభించాడు. రోజురోజుకీ అతడి దగ్గర టిఫిన్స్ కొనుకునే వారి సంఖ్య 70కు చేరింది. ఇక జాబ్ చేసే అవసరం లేదని ఆయన తేల్చి చెబుతున్నాడు. ఇదే లాభదాయకంగా ఉంది అంటున్నాడు. ఇదేనేమో మససుంటే మార్గం ఉంది అనడానికి నిదర్శనం.