జగన్ను నమ్ముకుని చెడిపోయిన వాళ్లు, చంద్రబాబును నమ్ముకుని బాగుపడిన వాళ్లు లేరనే నానుడి తెలుగునాట స్థిరపడి పోయింది. జగన్ ప్రతిపక్షంలో ఉన్నా, నేడు అధికార పక్షంలో ఉన్నా తనను నమ్ముకున్న లేదా తాను నమ్మిన వాళ్లకు ఏ విషయంలోనూ జగన్ తక్కువ చేయలేదు.
కానీ చంద్రబాబు రాజకీయం అందుకు పూర్తి విరుద్ధం. ఇందుకు తాజాగా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక జగన్ చిత్తశుద్ధిని తెలియజేస్తోంది.గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా అమలాపురం మాజీ ఎంపీ పండుల రవీంద్రబాబు, ముస్లిం మైనార్టీ మహిళ జకియా ఖానమ్ పేర్లను ఖరారు చేశారు. ఈ మేరకు గవర్నర్కు వారిద్దరి పేర్లను సిఫార్సు చేశారు. అమలాపురం ఎంపీగా గత సార్వత్రిక ఎన్నికల ముందు టీడీపీ నుంచి వైసీపీలో చేరారు. అప్పట్లో ఆయనకు టికెట్ కేటాయించలేకపోయారు. జగన్ పాదయాత్రలో పి.గన్నవరం సభలో పండుల రవీంద్రబాబుకు ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తానని హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆ హామీని జగన్ నిలుపుకున్నారు.ఇక జకియా ఖానమ్ విషయానికి వస్తే సీఎం సొంత జిల్లా రాయచోటి నివాసి. రాయచోటి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ అఫ్జల్ అలీఖాన్ భార్యే జకియా ఖానమ్.
సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా రాయచోటి బహిరంగ సభలో జగన్ మాట్లాడుతూ రాయచోటి మైనార్టీలకు ఎమ్మెల్సీ కేటాయిస్తానని హామీ ఇచ్చారు. జగన్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అప్జల్ అలీఖాన్ గుండె పోటుతో మృతి చెందాడు. ఆ సందర్భంలో ముఖ్యమంత్రి జగన్ స్పందిస్తూ అప్జల్ కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఇప్పుడు అవకాశం రావడంతో ఎమ్మెల్సీ పదవిని అప్జల్ భార్యకు ఇచ్చి తనను నమ్ముకున్న వాళ్లకూ అన్ని వేళలా అండగా ఉంటానని జగన్ మరోసారి నిరూపించారు
ఇక చంద్రబాబు రాజకీయం ఎలా ఉంటుందంటే పార్టీ సీనియర్ దళిత నాయకుడు వర్ల రామయ్యకు కు రాజ్యసభ సీట్ ఇచ్చినట్టు సీన్ క్రియేట్ చేసి ఆఖరినిమిషంలో హ్యాండిచ్చారు.అదే వర్ల రామయ్యను మొన్న రాజ్యసభ ఎన్నికల్లో ఓడిపోతారని తెలిసి కూడా టిడిపి తరఫున పోటీకి నిలబెట్టి మరోసారి చంద్రబాబు ఆయనను మరోసారి బలిపశువును చేశారు.అందుకే గొర్రె కసాయిని నమ్మడం టిడిపి నేతలు చంద్రబాబును విశ్వసించడం ఒకటేనని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.