పార్టీ మారినంత సులువు కాదు ప్రజలను కన్విన్స్ చేయడమంటే ! ఒక పార్టీ తరఫున గెలిచి సంవత్సరంలోపే ఇంకో పార్టీలోకి దూకేస్తే గెలిపించిన ప్రజలు రియాక్టు కాకుండా వుండరు.
తగిన సమయం కోసం వాళ్లు ఎదురుచూస్తుంటారు.ఇదే ఇప్పుడు గన్నవరంలో నియోజకవర్గంలో జరుగుతోందట .మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ ప్రపంచాన్ని ఎదురొడ్డి మరీ గన్నవరంలో గెలుపొందిన టిడిపి అభ్యర్థి వల్లభనేని వంశీ అకస్మాత్తుగా వైసిపికి మద్దతు ప్రకటించేశారు.ఆయనైతే వైసిపిలో కొచ్చారు కాని ఆయన వెంట టిడిపి వారెవరూ రాలేదట.అవసరమైతే గన్నవరం ఎమ్మెల్యే పదవికిరాజీనామా చేసి మళ్లీ ఉప ఎన్నికలలో నిలబడతానని వంశీ ప్రకటించిన నేపథ్యంలో ఆయన విజయావకాశాలు ఎలా ఉంటాయన్న దానిపై ఒక సర్వే జరిగింది.
ఈ సర్వే ఫలితం వంశీకి పూర్తి వ్యతిరేకంగా రావటం ఇక్కడ గమనార్హం.గన్నవరంలో వైసీపీ తరుఫున వంశీ నిలబడితే.. ఆయనకు పోటీగా టీడీపీ తరుఫున ఎవరు నిలబడినా టీడీపీకే 54శాతం ఓట్లు వస్తాయని తేలిందట.. ఎందుకంటే వంశీకి ఓట్లు వేస్తే ఇప్పుడు మమ్మలను ముంచిపోయాడని.. అతడి స్వార్థం కోసం పార్టీ మారాడని జనాలు అభిప్రాయపడుతున్నారట..అదేవిధంగా రియల్ వైసీపీ నాయకులు అయిన దుట్టా రామచంద్రారావు వైఎస్ఆర్ కుటుంబం కి దగ్గరివారు.. ఆయన మనషులు కూడా మాకు అభిమానం ఉన్నా కూడా వంశీని ఓడగొడుతాం అని స్పష్టం చేస్తున్నారట….ఇక మొన్నటి ఎన్నికల్లో పోటీచేసిన వెంకట్ రావు మనుషులు కూడా అదే విధంగా చెప్తున్నారట.
ఆ నియోజకవర్గంలో మొత్తం 3200 శాంపిల్స్ చేశారంట.. దానిలో టీడీపీ నుంచి క్యాండిడేట్ ఎవరైనా సరే.. టీడీపీకే ఓటు వేస్తాం అని ఏకంగా 54శాతం మంది చెప్పారంటే వంశీ మీద ఎంత వ్యతిరేకత నియోజకవర్గంలో ఉందో చెప్పకనే చెప్తోందని పలువురు అంటున్నారు.మామూలుగానే గన్నవరం నియోజకవర్గం టిడిపికి కంచుకోట.టిడిపి ఆవిర్భావం తర్వాత ఆ నియోజకవర్గంలో కాంగ్రెస్ గానీ మరో పార్టీ గాని గెలిచింది ఒకటి ..రెండు సార్లే !మొన్నకూడా వంశీని గెలిపిస్తే ఆయన పార్టీ మారడాన్ని టిడిపి వర్గాలు సహించలేక ఉన్నాయి.వైసీపీ వర్గాలు ఆయన రాకను స్వాగతించటం లేదు.ఈ నేపథ్యంలో గన్నవరం నియోజకవర్గంలో వల్లభనేని వంశీ రాజకీయంగా పతనావస్థకు చేరుకున్నట్టే నని పరిశీలకులు భావిస్తున్నారు.వంశీతో పాటు పార్టీ మారిన మరో ఇద్దరు టిడిపి ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో కూడా ఇందుకు భిన్నమైన పరిస్థితి ఉండకపోవచ్చును అన్నది పరిశీలకుల అంచనా.