ఏపీలో కరోనా వైద్యసేవలు అద్భుతంగా ఉన్నాయట.. నెలకు 350 కోట్లు ఖర్చుపెట్టి వైద్య సేవలు అందిస్తోందట.. మన రాష్ట్రంలో తప్ప మరే రాష్ట్రంలోనూ కరోనా వైద్య సేవలు అందడం లేదట. వినడానికి గమ్మత్తుగా ఉన్న ఈ వ్యాఖ్యలు చేసింది ఏపీ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని గారు. తిరుపతి పర్యటన సందర్భంగా స్థానిక స్విమ్స్ లో ఏర్పాటుచేసిన సమీక్షలో అధికారులతో అన్న మాటలివి. వినడానికి గమ్మత్తుగా ఉన్నాయి కదూ..! అయితే.. ఈ వ్యాఖ్యలు వారి పార్టీ నాయకుల కోసమా.. అధికారుల కోసమా.. ప్రజల కోసమా..!
ఎమ్మెల్యేలు హైదరాబాద్ కు ఎందుకు వెళుతున్నట్టు..
కరోనా వైరస్ బారిన పడి హైదరాబాద్ లోని ప్రముఖ ప్రైవేటు ఆసుపత్రుల్లో చేరిన వైసీపీ నాయకులను పరిశీలిస్తే.. రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి, మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే అంబటి రాంబాబు – అపోలో, కరణం బలరాం – స్టార్ హాస్పిటల్ లో చేరి చికిత్స పొందుతున్నారు. మొత్తంగా 9మంది వైసీపీ నాయకులు కరోనా బారిన పడితే వీరిలో 7గురు హైదరాబాద్ వెళ్లి చికిత్స తీసుకున్నారు. మరో ఇద్దరు హోమ్ క్వారంటైన్ లో ఉన్నారు. మరి ఈ లెక్కలన్నీ వైద్యశాఖ మంత్రి వద్ద ఉన్నాయో లేదో తెలీని పరిస్థితి.
ఏపీలో వైద్యసేవలే బాగుంటే.. వేగంగా నయం చేసే వ్యవస్థ ఉంటే వైసీపీ నాయకులు హైదరాబాద్ ఎందుకు వెళుతున్నట్టు. ప్రభుత్వానికి డబ్బులెక్కువై ఖర్చు చేస్తోందా.. లేక వారి దగ్గర డబ్బులు ఎక్కువున్నాయా అనే కామెంట్లు వస్తున్నాయి. మంత్రి గారు ఓసారి తమ పార్టీ నాయకులు ఎవరెవరు హైదరాబాద్ వెళ్లి చికిత్స తీసుకుంటున్నారో వివరాలు తెప్పించుకోవాలని విమర్శలు వస్తున్నాయి. అప్పుడే.. రాష్ట్రంలో వైద్యసేవలు బాగున్నాయి అంటూ ప్రజలకు వివరించాలని వ్యంగ్యాస్త్రాలు వస్తున్నాయి.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?