ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ళ నాని ఈరోజు తిరుపతిలోని పద్మావతి స్విమ్స్ కోవిడ్ హాస్పిటల్ లో తనిఖీలు చేసారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకంగా ఆదేశించడంతో తాను ఈ తనిఖీలు చేపడుతున్నట్లు నాని తెలిపారు.
పీపీఈ కిట్ ధరించి నాని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రతి కరోనా బాధితుడికి భోజనం కోసం ఐదు వందల రూపాయలను ప్రభుత్వం ఖర్చు చేస్తోందని, మొత్తంగా ప్రతీ నెలా 350 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి కేటాయించారని ఆళ్ళ నాని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రోజుకు 50 వేల టెస్టులు చేస్తున్న రాష్ట్రం మనదేనని తెలిపారు. ఆళ్ళ నానితో పాటు ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి, కలెక్టర్ నారాయణ భరత్ గుప్తా, ఇతర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఉన్నారు.