వేసవి కాలంలో రోజూ కనీసం ఒక్క గ్లాస్ పండ్ల రసాలను తాగడం అవసరం. వేసవిలో ఏ రసం త్రాగటం ఉత్తమం అనేది తెలియదు చాలామందికి . ఆ జ్యూస్ ఏంటో చూద్దాం . మోసంబి జ్యూస్ అద్భుతమైనది . ఈ సిట్రస్ పండు అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉంది . ఇది శరీరాన్ని చల్లగా ఉంచుతుంది . ఇంకా ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో చూద్దాం .
మోసంబి జ్యూస్ వేసవిలో ఉత్తమమైన పానీయం ఎందుకంటే దాని పోషణ శరీరానికి అవసరమైన పోషకాలతో నిండి ఉంటుంది . ఫైబర్ , విటమిన్ సి , కాల్షియం, ఇనుము ,పొటాషియం ,రాగి . ఈ పండు యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఇందులో చాలా తక్కువ కేలరీలు ఉంటాయి.పెద్ద మొత్తంలో మోసంబిలో గరిష్టంగా 43 కేలరీలు ఉంటాయి.మీరు బరువు తగ్గడానికి ప్రయత్నిస్తుంటే, మీ డైట్ లో మోసాంబి రసాన్ని చేర్చండి.దీనివల్ల వేగంగా మరియు ఆరోగ్యంగా బరువు తగ్గుతారు.మోసంబి రసం తాగితే శరీర శక్తి పెరుగుతుంది.వేసవి వేడిని నియంత్రిస్తుంది.
మోసంబి లో అధికంగా ఉండే నిమ్మకాయ గ్లూకోసైడ్ అయిన ఫ్లెవనాయిడ్ యాంటీ ఆక్సిడెంట్, బాక్టీరియల్ మరియు క్యాన్సర్ నిరోధక లక్షణలను కలిగి ఉంది.కాబట్టి మోసాంబి జ్యూస్ తాగితే శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.అనేక కంటి ఇంఫెక్షన్ ను మరియు గ్లాకోమా ,కంటి శుక్లమ్ వంటి కంటి సమస్యలను నివారిస్తుంది.అందమైన చర్మం పొందడానికి మోసంబి జ్యూస్ సహాయపడుతుంది.మోసంబి చర్మాన్ని మాత్రమే కాకుండా జుట్టు ఆరోగ్యన్నీ కూడా మెరుగు పరుస్తుంది.చుండ్రు మరియు జుట్టు రాలడం ఉన్నవారు రోజూ మోసంబి రసం తాగితే, ఈ సమస్యలను త్వరగా వదిలించుకోవచ్చు.