Healthy Eye Tips: ఈ కాలంలో వయసుతో పని లేకుండా కంటి సమస్యలు. వచ్చేస్తున్నాయి.ఒకప్పుడు వయసు పైబడిన వారికి మాత్రామే చూపు మందగించేది. కానీ ప్రస్తుత కాలంలో చిన్నా,పెద్దా అనే తేడా లేకుండా ప్రతి ఒకరు కూడా కంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు.. అతిగా ఫోన్ చూడడం, గంటల తరబడి టీవీ,కంప్యూటర్ ముందు కూర్చోవడం,కంటికి సరిపడా నిద్ర పోకపోవడం,అస్తమానం పుస్తకాలు చదవడం,సరైన ఆహారాన్ని తీసుకోకపోవడం వంటి కారణాల వలన కంటికి సంబందించిన అనారోగ్య సమస్యలు వస్తున్నాయి.కళ్ళు మసకబారడం, కళ్ళ వెంట నీళ్లు కారడం, సరిగా కనిపించకపోవడం వంటి కళ్లకు సంబందించిన సమస్యలు వస్తుంటాయి.ఈ సమస్యల నుండి బయటపడడానికి వైద్యులు కళ్ల జోడును ధరించమని సలహా ఇస్తుంటారు. అయితే కళ్ళజోడును వాడే పని లేకుండానే మన ఇంట్లోనే ఒక ఆయుర్వేదం పొడిని తయారు చేసి వాడడం వల్ల మీ కంటి చూపు మెరుగుపడుతుంది. మరి ఆ పొడి ఏంటి.. ఎలా తయారుచేయాలో చూద్దామా..
కావల్సిన పదార్థాలు :
50 గ్రాముల బాదం పప్పు
50 గ్రాముల సోంపు గింజలు
50 గ్రాముల పటిక బెల్లం.
Healthy Eye Tips: పొడి తయారీ విధానం
- Read the latest news in Telugu from AP and Telangana’s most trusted news website.
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ముందుగా 50 గ్రాముల బాదం పప్పును తీసుకుని వాటిని ఒక రాత్రంతా వేడి నీటిలో వేసి నానబెట్టాలి.ఉదయాన్నే బాదం పప్పుల పొట్టు తీసి వాటిని ఎండలో ఎండబెట్టాలి. బాధంపప్పులు పూర్తిగా ఎండిన తరువాత వాటిని దంచి మెత్తని పొడిగా చేసుకోవాలి.ఆ తరువాత సోంపు గింజలను కూడా వేయించి మెత్తని పొడిగా చేసుకోవాలి. అలాగే పటిక బెల్లాన్ని కూడా మెత్తని పొడిగా చేయాలి.ముందుగా పొడి చేసుకున్న బాదం పొడి, సోంపు గింజల పొడి, పటిక బెల్లం పొడి మూడింటిని కలిపాలి. ఇప్పుడు ఒక తడి లేని గాజు సీసాను తీసుకుని ఈ పొడిని ఆ సీసాలో నిల్వ చేసుకోవాలి.
ఈ పొడిని ఎలా తీసుకోవాలంటే..?
- Read the latest news in Telugu from AP and Telangana’s most trusted news website.
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఈ పొడిని పిల్లలు అయితే ఒక టీ స్పూన్ చొప్పున, పెద్దలు అయితే రెండు టీ స్పూన్ల చొప్పున ఒక గ్లాస్ ఆవు పాలలో కలుపుకుని ప్రతి రోజు రెండు పూటల తాగాలి.ఈ విధంగా క్రమం తప్పకుండా ఒక ఆరు నెలల పాటు తాగితే కళ్లకు ఉన్నా సమస్యలు అన్ని తొలగిపోతాయి. ఈ పొడి తాగాడం వలన కళ్ల అద్దాలు వాడే పని ఉండదు.అంతేకాకుండా పిల్లల్లో జ్ఞాపక శక్తి కూడా పెరిగి చదువుల్లో ముందడుగు వేస్తారు. మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఈ ప్రత్యేకమైన పొడిని తయారు చేసుకుని పిల్లలు, పెద్దలు క్రమతప్పకుండా తింటూ ఉండండి. మీ కంటి సమస్యలను దూరం చేసుకోండి.