Heart Transport on metro train : అన్ని దానాల్లో కెల్లా అన్న దానం గొప్పదని పెద్దలు చెపుతుంటారు. కానీ ప్రస్తుత రోజుల్లో అన్ని దానాల్లోకి అవయవదానం చాలా గొప్పది అంటున్నారు.. నిజానికి చనిపోతూ కూడా మరికొంత మందికి ప్రాణదానం చేయడం చాలా గొప్ప విషయం.. మనిషి చనిపోతే శరీరం తో పాటు మిగతా అవయవాలు శిథిలమై పోతాయి.. ఎవ్వరికీ ఉపయోగపడవు.. కానీ నేటి రోజుల్లో అవయవ దానాల వల్ల ఎన్నో ప్రాణాలు నిలబడుతున్నాయి..ఈ నేపథ్యంలో బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి గుండె ను గుండె మార్పిడి శస్త్ర చికిత్స నిమిత్తం తొలిసారిగా మెట్రో ట్రైన్ లో తరలించారు.. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా వున్నాయి..
హైదరాబాద్ మెట్రో ట్రైన్ లో మొదటి సారి గుండెను తరలించారు. జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో గుండె మార్పిడి శస్త్ర చికిత్స నిమిత్తం ఎల్ బీ నగర్ కామినేని హాస్పిటల్ నుంచి గుండె ను మెట్రో ట్రైన్ లో పంపించారు. దీంతో నాగోల్ నుంచి జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వరకు ఎక్కడ ఆగకుండా మెట్రో ట్రైన్ ప్రయాణించింది. ట్రాఫిక్ సమస్యను అధిగమించేందుకు వైద్యులు ఇలా చేశారు. నల్గొండ జిల్లాకు చెందిన ఒక రైతు కు బ్రెయిన్ డెడ్ కావడం తో అతని గుండె ను దానం చేసేందుకు అతని కుటుంబం ముందుకు వచ్చింది..దీంతో రైతు గుండె ను మరో వ్యక్తికి అమర్చనున్నారు. మెట్రో రైలు అధికారులకు హాస్పటల్ సిబ్బంది సమాచారం తెలపడంతో ఈ ఏర్పాట్లు చేశారు..