(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
బంగాళఖాతంలో ఉపరితల ద్రోణి ప్రభావంతో ఏపీ, తెలంగాణలో వర్షాలు కురుస్తున్నాయి. మరో రెండు రోజులు పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. గత మూడు రోజులుగా తెలంగాణ, ఏపీలో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు జిల్లాలో వానలు పడుతున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.
తెలంగాణలో కూడా వాతావరణం చల్లగా మారింది. సోమవారం రాత్రి భాగ్యనగరంలో పలుచోట్ల వర్షం పడింది. దీనికితోడు చల్లనిగాలులు వీస్తుండంతో జనం బయటకు రావడం లేదు. అకాల వర్షాల పట్ల రైతులు ఆందోళన వ్యక్తం చేస్తోంది. చేతికొచ్చిన పంట నీటమునుగుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?