గుంటూరు: ఉపరితల ఆవర్తన ధ్రోణి కారణంగా గుంటూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు వంకలు ఉదృతంగా ప్రవహిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. వందలాది ఎకరాల పంట పొలాల్లో వర్షపు నీరు నిలవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రధానంగా రాజుపాలెం మండలం రెడ్డిగూడెం వద్ద రాళ్లవాగు పోటెత్తి ప్రవహిస్తున్నది. దీంతో గుంటూరు – హైదరాబాద్ మద్య రాకపోకలు నిలిచిపోయాయి. తాటికొండ, నరసరావుపేట, పెదకూరపాడు, ప్రత్తిపాడు, యడ్లపాడు, కాకుమాను, పెదనందిపాడు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసాయి. చాలా ప్రాంతాల్లో రహదారులు, లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు నిలవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షాల కారణంగా జిల్లాలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మరో రెండు రోజుల పాటు కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో ఒక మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేయడంతో ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
previous post
next post