ఖాట్మండు : నేపాల్లో హెలికాఫ్టర్ కూలిన ఘటనలో ఏడుగురు మృతి చెందారు. నేపాల్లోని తెహ్రాతూమ్ జిల్లాలో బుధవారం హెలికాఫ్టర్ కుప్పకూలింది. మృతుల్లో నేపాల్ పర్యాటక శాఖ మంత్రి రవీంద్ర అధికారి కూడా ఉన్నారు.
మంత్రి రబీంద్ర అధికారి ఒక ఆలయ సందర్శన అనంతరం చుహన్ దండలో విమానాశ్రయ నిర్మాణ పనులు పరిశీలించడానికి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఈ ఘటనను నేపాల్ పౌర విమానయాన సంస్థ అధికారికంగా దృవీకరించింది.
ప్రమాదం సమయంలో హెలికాఫ్టర్లో మంత్రి రబీంద్రతో పాటు ఆయన భద్రతా సిబ్బంది, పైలట్, యతి ఎయిర్ లైన్స్ డైరెక్టర్ అంగ్ చింగ్ షెర్పా, నేపాల్ ప్రధాని బంధువు యబ్బరాజ్ దహాల్ ఉన్నట్లు సమాచారం.