పోలీసులపై ఒ మహిళ తీవ్ర ఆరోపణలు చేసింది. పది రోజుల పాటు లాకప్లో నిర్బంధంచి తనపై అయిదుగురు కానిస్టేబుళ్లు సామూహిక అత్యాచారానికి ఓడిగట్టారని 20 ఏళ్ల యువతి ఆరోపించడం తీవ్ర కలకలాన్ని రేపింది. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని రేవా జిల్లాలో జరిగింది.
మధ్యప్రదేశ్లోని రేవా జిల్లా జైలును ఈ నెల 10వ తేదీన జిల్లా అదనపు న్యాయమూర్తి నేతృత్వంలో పలువురు న్యాయమూర్తుల బృందం చేసింది. ఆ సమయంలో అదనపు జిల్లా న్యాయమూర్తి అండర్ ట్రైల్ ఖైదీలకు అందుతున్న వసతులు, సదుపాయాలు, వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఆ సయమంలో ఒ 20 ఏళ్ల యువతి తనపై పోలీసులు అత్యాచారానికి పాల్పడ్డారని న్యాయమూర్తి ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై ఆయన న్యాయ విచారణకు ఆదేశించారు.
ఈ ఏడాది మే 9వ తేదీ నుండి 21వ తేదీ మధ్య పది రోజుల పాటు అయిదుగురు కానిస్టేబుళ్లు తనపై పదే పదే అత్యాచారం చేశారనీ ఆ యువతి మహిళా న్యాయ వాదుల బృందానికి చెప్పినట్లు సమాచారం. తనకు పోలీస్ స్టేషన్ లో రక్షణగా ఉన్న మహిళా కానిస్టేబుల్ను వారు బెదిరించి తనపై అత్యాచారం చేశారని ఆవేదన వ్యక్తం చేసింది. తనపై జరిగిన అత్యాచారం గురించి మూడు నెలలుగా జైలు వార్డెన్, జైలు అధికారులకు కూడా చెప్పినట్లు తెలియజేసింది. బాధితురాలి ఫిర్యాదుపై న్యాయమూర్తి పోలీసులను విచారించారు. అయితే తాము ఆమెను మే 21వ తేదీన అరెస్టు చేసి వెంటనే రిమాండ్కు పంపినట్లు పోలీసులు చెప్పినట్లు సమాచారం. అయితే ఆ యువతి చేసిన ఆరోపణలపై న్యాయమూర్తి విచారణకు ఆదేశించినట్లు ఒ జాతీయ మీడియాలో వచ్చింది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?