డ్రగ్స్.. ఈ పేరు మన దేశంలో వినిపించేది తక్కువే కానీ వాడకం మాత్రం ఎక్కువగానే ఉంది.. క్షణకాలం సంతోషం నూరేళ్ల జీవితంలోని వెలుగును దూరం చేస్తుంది.. భారతదేశం మత్తు పదార్ధాలకు అడ్డాగా మారుతోంది.. జరుగుతున్న పరిస్థితులు అలా ఉన్నాయి మరి.. ప్లాస్టిక్ పైపులకు వెదురు రంగు వేసి అందులో హెరాయిన్ నింపి ఆయుర్వేద మందులంటూ దిగుమతి చేస్తూ ఇటీవల అధికారులు పట్టుకున్న సంగతి అందరికి తెలిసిందే.. అంతకముందు యాపిల్ డబ్బాల్లో హెరాయిన్ ను తరలిస్తూ చిక్కుకున్నారు.. తాజాగా చెప్పుల్లో.. పూర్తి వివరాలు ఇలా..
ఉగాండా కు చెందిన ఓ మహిళా ఢిల్లీ నుంచి ముంబైకి విమానంలో వచ్చింది. ఛత్రపతి శివాజీ విమానాశ్రయం లో అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ నేపధ్యంలో ఆమె చెప్పుల్లో 501 గ్రాముల హెరాయిన్ ను గుర్తించారు. విదేశాల నుంచి దిగుమతి అవుతున్న హెరాయిన్ స్మగ్లింగ్ కు పాల్పడిన మహిళను అధికారులు పట్టుకున్నారు. ఆమె పై నార్కోటిక్స్ చట్టాల కింద పోలీసులు అరెస్ట్ చేసారు. పట్టుబడ్డ హెరాయిన్ విలువ మార్కెట్లో రూ.2.5 కోట్లు గా ఉంటుందని సమాచారం.