చిత్తూరు జిల్లాలో కూతుళ్లతో కాడి పట్టించిన రైతు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం, బాలీవుడ్ నటుడు సోనూ సూద్ స్పందించి ట్రాక్టర్ పంపించడం మీడియాలో హైలెట్ కావడం తెలిసిందే .అయితే ఈ వ్యవహారం మొత్తం అడ్డం తిరిగింది.
ఆర్థిక సమస్యలతో గాకుండా కరోనా స్వీట్ మెమొరీ గా ఉంటుందని సదరు రైతు తన కూతుళ్లతో కాడి పట్టిచ్చి సరదాగా ఆ వీడియో తీయించారట.కెవిపల్లి మండల పరిషత్ అభివృద్ధి అధికారి మనోహర్ రాజు స్వయంగా ఈ విషయాన్ని ధ్రువీకరించారు.అసలు జరిగిందేమిటంటే ఆ వీడియోలోని రైతు వీరదల్లు నాగేశ్వరరావు మదనపల్లె టౌన్లో ఉంటారు. కరోనా టైములో పల్లెటూరు సేఫ్ అని వాళ్ళ సొంతూరు వెళ్లారు. కరోనా టైములో ఒక తీపి గుర్తుగా ఉంటుందని నాగేశ్వరరావు ఆయన కుమార్తెలు స్వయంగా నాగలితో ప్రయత్నం చేశారు. దానిని ఫోటోలు, వీడియోలు తీసుకున్నారు. వాటిని తమ సోషల్ మీడియాలోకి అప్లోడ్ చేశారు .అయితే వాళ్ళు సరదాగా చేసిన పని వైరల్గా మారి సోనూ సూద్ కి చేరింది. వెంటనే స్పందించి వాళ్లకు ట్రాక్టర్ పంపిస్తానన్న సోనూ సూద్ ట్వీట్ తరువాత ఆ రైతుకు అవసరమైన ఏర్పాట్లు చేయమని సీఎం జగన్ ఆఫీస్ నుండి లోకల్ ఎంపీడీఓ మనోహర్ రాజుకు సమాచారం వెళ్ళింది. ఎంపీడీఓ ఆ ఊరుకి వెళ్ళి విచారించగా అది వాళ్ళు సరదాగా చేసిన వ్యవహారమని వెలుగు చూసింది.ఈ విషయాన్ని ప్రభుత్వానికి నివేదించే లోపే సోనూ సూద్ ట్రాక్టర్ పంపించేశాడు..స్వయంగా ఎండిఓ మనోహర్ రాజే ఈ కథనాన్ని మీడియాకి వ్యవహరించటం ఇక్కడ గమనార్హం.అయితే
ఆ రైతు కూడా మంచివాడే. ట్రాక్టర్ ని తిరిగి ఇవ్వటమో లేక పంచాయితీకి ఇవ్వటమో చేయాలని ఆలోచిస్తున్నట్లు తెలిసింది.ఏదిఏమైనప్పటికీ ఎక్కడో ముంబైలో ఉండి కూడా తక్షణం స్పందించిన సోనూ సూద్ మాత్రం గ్రేట్.. గ్రేట్ హ్యూమన్ బీయింగ్!ఇదండి సోను సూద్ ట్రాక్టర్ కధ! అంటే వైరల్అయ్యినవన్నీ నిజాలు కానక్కర్లేదు