కరోనా .. ఈ పేరు వింటే గుండెల్లో తెలియని భయం మొదలైతోంది. ఏడాది నుంచి ఈ కరోనా వైరస్ ప్రపంచాన్ని గద్దున వణికిస్తోంది. ఇంట్లోనుంచి కాలు బయట పెట్టాలంటే పుట్టెడు భయాన్ని తీసుకు వస్తోంది. ఏ పని చేయాలన్నా ఒకటికి రెండు సార్లు ఆలోచించి.. అత్యవసరం అయితే తప్ప భయటకు పోనివ్వడం లేదు. బయటకు పోవాలన్నా.. మాస్కు, శానిటైజర్ తప్పని సరిగా తీసుకుపోయేలా చేసింది ఈ కరోనా వైరస్. దాంతో కరోనా అంటే రోజురోజుకు ప్రజల్లో భయం పెరుగుతోంది.
ప్రాణాల మీద ఉన్న ప్రీతితో బంధువులను, స్నేహితులను కలవాలన్నా కూడా ఎంతో ఆలోచిస్తున్నారు జనం. ఎక్కడ కరోనా సోకుతుందో అనే భయంతో ఫోన్లోనే మాట్లాడుకుంటున్నారు. ఎక్కడికి వెళ్లాలన్నా భయం, బయట ఏది తిందామన్నా భయం, ఏదైనా ముట్టుకుందామంటే మరీ భయంతో వణికి పోతున్నారు జనం.
ఇలా సమాజానికి దూరం అయిపోతున్నామనే భయం చాలా మందిని వేధిస్తోంది. అందుకే ఇళ్లకే పరిమితమై.. ఒంటరితనంతో క్రుంగిపోతున్నారు. ఎక్కడ కరోనా వైరస్ సోకి వివక్షకు గురవుతామో అన్న భయం చాలా మందిలో ఉన్నాయని పలు సర్వేలు చెబుతున్నాయి. దీంతో జనం తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. ఆ ఒత్తిడిని తట్టుకోలేక ప్రపంచంలోని చాలా మంది మత్తుకు బానిసలు అవుతున్నారని పలు సర్వేలు చెబుతున్నాయి.
మానసిక ఒత్తిడితో చాలా మంది క్రుంగిపోతున్నారు. ఆ ఒత్తిడిని తట్టుకునేందుకే మద్యాన్ని తాగుతున్నారని ఈ సర్వేలు చెబుతున్నాయి. కరోనా భయం నుంచి బయటపడేందుకు ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో కోట్ల మంది మద్యం మత్తులో ఊగున్నారని చెబుతోంది. అయితే కరోనా భయం పోగొట్టుకోవడానికి ఎవరెవరు ఏం చేస్తున్నారనే అంశంపై సైంటిస్టులు ఒక పరిశోధన చేశారు. అందులో ఆశ్చర్యకరమైన విషయాలు బయటకు వచ్చాయి.
అయితే ఈ రీసెర్చ్ అమెరికాలోని మసాచూసెట్స్లో ఉన్న మెక్లీన్ హాస్పిటల్ లో జరిగింది. వైద్య నిపుణులు ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న మద్యం వినియోగంపై ఒక రీసెర్చ్ చేశారు. అందులో పలు విషయాలు బయటకు వచ్చాయి. కరోనా ఒత్తిడిని తగ్గించుకునేందుకే జనం ఇంత ఎక్కువగా మద్యాన్ని తాగుతున్నట్లు ఈ వైద్య బృదం తెలిపింది. కరోనాను ఎలా ఎదుర్కొవాలో ప్రజలకు చెప్పాలని, ఇలా తాగడం వల్ల ఎదురయ్యే సమస్యలను కూడా చెప్పాలని వైద్యులు సూచిస్తున్నారు.