Carona: ఆహారం లోభాగం గా
కరోనా ఎఫెక్ట్ పిల్లలపై పడకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తప్పని సరి. పిల్లల్లోవ్యాధి నిరోదక శక్తి పెరిగేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం. పిల్లల్లో సహజ సిద్దంగా రోగ నిరోదక శక్తిని పెంచడానికి ముఖ్యమైన 5 చిట్కాలను ఇప్పుడు చూద్దాం. ఆయుర్వేద నిపుణులు తెలియచేసిన దాని ప్రకారం ఆహారం లోభాగం గా అల్లం తీసుకోవడం ఆరోగ్యానికి ( Health ) చాలా మంచిది. అల్లం పెద్ద వారికి మాత్రమేకాదు పిల్లలకి కూడా మంచి ఔషదం గా పని చేస్తుంది. ప్రతి రోజు ఉదయమే పరగడుపున కాస్త అల్లం రసం మరియు తేనె 5 చుక్కలను కలిపి పట్టించాలి. వీటి వల్ల కూడా పిల్లలో రోగ నిరోదక శక్తి పెరుగుతుంది.
Carona: ప్రతి రోజు రాత్రి
బెల్లం ఆరోగ్యానికి మంచి ఔషదంగా పనిచేస్తుంది. బెల్లం లో ఉండే యాంటీ ఇన్ ప్లామేటరీ ( Anti Inflamatery )గుణాల వలన ప్రతి రోజు పిల్లల ఆహారంలో ఉండేలా చూసుకోవాలి. అలా చేయడం వలన పిల్లల ఆరోగ్యం మీద ప్రభావ వంతం గా పనిచేయడం తో పాటు మెదడు చాలా చురుకుగా పని చేస్తుంది. ఉత్సాహంగా , ప్రతి విషయంలో కూడా స్పీడ్ గా ఆలోచించే అవకాశం ఉంటుంది.
ప్రతి రోజు రాత్రి పిల్లలకు పాల తో పాలు తాగించడం అనేది వారి ఆరోగ్యానికి చాలా మంచిది. పాలల్లో పావు టీ స్పూన్ పసుపు లేదా దాల్చిన చెక్క ఫౌడర్ కాని, యాలకులు లేదా లవంగాల పౌడర్ ఇలా ఎదో ఒకటి తాగిస్తుండాలి. వారికి ఏది ఇష్టమైతే కనీసం వీటిల్లో ఒక్కటి అయినా వేసి తాగించడం వల్ల శరీరం లో ఐరెన్ శాతం పెరిగి ఆరోగ్యంగా ఉంటారు. ఎముకలు దృడంగా ఉండి కండర మరియు ఎముకల సమస్యలను అడ్డుకోవచ్చు.
సహజసిద్ధమైన
కొంచెం ఇబ్బంది అయినా కూడా ప్రతి రోజు పిల్లలకు అశ్వగంథ పొడిని ఇవ్వాలి. వారితో బలవంతంగా అయినా ఆ పొడిని ఏదో ఒక రూపంలో ఇవ్వాలి. అలా చేయడం వలన పలు అనారోగ్య సమస్యలు, దీర్ఘ కాలిక సమస్యలు రాకుండా రక్షణ కలుగుతుంది. ఈ సహజసిద్ధమైన పదార్ధాలు తీసుకోవడానికి పిల్లలు కచ్చితంగా మారం చేస్తారు.అలా అని ఇవ్వడం మానకుండా వారికీ నచ్చచెప్పి వాటిని పట్టించే ప్రయత్నం చేయండి.