Nellore Anandhayya: దేశంలో కరోనా సెకండ్ వేవ్ సృష్టిస్తున్న విలయతాండవం అనేక మంది ప్రాణాలను బలిగొన్న సంగతి తెలిసిందే. రెండోసారి వచ్చిన ఈ మహమ్మారి వల్ల చాలామంది కరోనా రోగులు ట్రీట్మెంట్ కోసం ఆస్తులు అమ్ముకున్న పరిస్థితి నెలకొంది. హాస్పిటల్ కి వెళ్ళిన ఆక్సిజన్ బెడ్ లు లేక ఎంత పరపతి ఉపయోగించిన చాలామంది కరోనా బారిన పడి ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోయి ప్రాణాలు పోగొట్టుకున్న పరిస్థితి. ప్రపంచం మొత్తం ఈ మహమ్మారిని ఎదుర్కోవటం కోసం వైద్యరంగం నానా తిప్పలు పడుతూ ఉంటే.. నెల్లూరు జిల్లా కృష్ణపట్నం కి చెందిన ఆనందయ్య అనే వ్యక్తి కనిపెట్టిన కరోనా నాటు మందు వల్ల అనేకమంది కరోనా బారిన పడిన వాళ్ళు చావుబతుకుల స్థితిలో ఉన్న వాళ్లు కూడా.. ఆనందయ్య మందు కంటిలో వేసుకుని ప్రాణాపాయం నుండి తప్పించుకున్నారు.
వాటికి సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రభుత్వం.. ఆనందయ్య కనిపెట్టిన మెడిషన్ పై అధ్యయనం చేస్తూ ఉంది. ఇలాంటి తరుణంలో ఆనందయ్య కు అండగా టాలీవుడ్ హీరో జగపతిబాబు రంగంలోకి దిగారు. ఆనందయ్య కనిపెట్టిన మందును సపోర్ట్ చేస్తూ తన సోషల్ మీడియాలో .. ఆయన ఫోటోలతో పాటు మెడిషన్ పోస్ట్ చేశారు.
Read More: Corona: కరోనాతో ప్రాణాలు పోతున్నా ఈ పాపాత్ముల దందా ఆగట్లేదు
అంతేకాకుండా ఆనందయ్య రూపంలో ప్రకృతి తల్లి ప్రజలను రక్షించడానికి వచ్చింది అనిపిస్తోంది, ఆనందయ్య వైద్యానికి ప్రభుత్వం అధికారికంగా అనుమతి ఇవ్వాలని ప్రార్థిస్తున్నట్లు ఈ ప్రపంచాన్ని కాపాడాలి అని దేవుడు ఆనందయ్య ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నట్లు జగపతి బాబు స్పష్టం చేశారు. దీంతో చాలామంది సోషల్ మీడియాలో నెటిజన్లు జగపతిబాబు పెట్టిన పోస్ట్ కి రియాక్ట్ అవుతా.. మెడికల్ మాఫియా ఆనందయ్య పై దాడి చేసే అవకాశం ఉందని, ఆయన్ను మనమే కాపాడుకోవాలి అన్ని సపోర్ట్ చేస్తున్నారు.