కళ్యాణ్ రామ్ హీరోగా… వేణు వశిష్ట అనే కొత్త దర్శకుడు దర్శకత్వంలో ‘బింబిసార’ చిత్రీకరించడం జరిగింది. ఆగస్టు 5వ తారీఖు ఈ సినిమా విడుదల అవుతుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాలో హీరోగా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా కళ్యాణ్ రామ్ వ్యవహరించారు. అయితే జులై 29వ తారీకు ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్ శిల్పకళా వేదికలో నందమూరి అభిమానుల మధ్య అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ రావడంతో… శిల్పకళా వేదిక దద్దరిల్లిపోయింది. ఎన్టీఆర్ ఎంట్రీ టైములో… సీఎం ఎన్టీఆర్, సీఎం ఎన్టీఆర్ అని అభిమానులు అరుపులు, కేకలు వేయడం జరిగింది.
ముఖ్యంగా “RRR” లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత.. ఏ ఈవెంట్ కి తారక్ వెళ్లకపోవడం బయట కనిపించకపోవడం తర్వాత..’బింబిసార’ ఫ్రీ రిలీజ్ వేడుకకి ముఖ్యఅతిథిగా రావటంతో… ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ వేడుకకు పోటెత్తారు. ఈ సందర్భంగా హీరో నందమూరి కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ… ఈసారి అభిమానులను డిసప్పాయింట్ చేయను. ‘బింబిసార’ అందరికీ నచ్చే సినిమా. ఈ సంవత్సరం మా తాతగారు పుట్టిన వందో సంవత్సరం. ఈ సినిమాను ఆయనకు అంకితం చేస్తున్నాను.
కీరవాణి గారు ఈ సినిమాకి లైఫ్ పోశారు. ‘బింబిసార’ కచ్చితంగా అందరికీ నచ్చుతుంది అని నందమూరి కళ్యాణ్ రామ్ స్పీచ్ ఇచ్చారు. అంతేకాదు చివరిలో వర్షాలు పడుతున్నాయి అందరూ వీళ్ళకి చాలా జాగ్రత్తగా వెళ్ళండి. ఆగస్టు 5వ తారీఖు ‘బింబిసార’ విడుదలవుతుంది అందరూ ఎంజాయ్ చేయండి. ఇక తర్వాత ఎన్టీఆర్ మాట్లాడుతూ..’బింబిసార’ తో అభిమానులను కాలర్ ఎగరేసేలా నందమూరి కళ్యాణ్ రామ్ చేస్తారు. మన అభిమానులు గర్వించదగ్గ సినిమా అంటూ తనదైన శైలిలో స్పీచ్ ఇచ్చారు.