Corona : దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే చాలా రాష్ట్రాలలో లాక్ డౌన్ అమలు చేస్తూనే మరోవైపు కర్ఫ్యూ విధిస్తూ ఉన్నారు. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినా కానీ పాజిటివ్ కేసులు పెరిగిపోతుండటం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు టెన్షన్ పుట్టిస్తున్నాయి. దీంతో వ్యాక్సినేషన్ పంపిణీ కార్యక్రమం శరవేగంగా జరిపించడానికి కేంద్రం ఆలోచన చేస్తూ ఉంది. ఇలాంటి తరుణంలో ఇప్పటికే చాలా మంది టాప్ సెలబ్రిటీలు మ్యాక్స్ ఇన్ ఒకపక్క వేయించుకునే మరోపక్క కరోనా బారిన పడుతున్నారు.
నిన్న బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ కు కరోనా పాజిటివ్ రావడం జరిగింది. ఇదిలా ఉంటే తాజాగా స్టార్ హీరో మాధవన్ కి కూడా కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ విషయాన్ని స్వయంగా ఆయన సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. త్రీ ఇడియట్స్ సినిమాలో అమీర్ ఖాన్ తో కలిసి మాధవన్ నటించడం జరిగింది. ఆ సినిమాలో చాలా వరకూ అమీర్ ఖాన్ నీ మాధవన్ ఫాలో అవుతూ ఉంటాడు. ఈ నేపథ్యంలో తాజాగా ఇద్దరిని వైరస్ ఫాలో అవుతున్నట్లు… త్రీ ఇడియట్స్ ఫోటోని పోస్ట్ చేస్తూ సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది. ప్రస్తుతానికి తన ఆరోగ్యం బాగానే ఉన్నట్లు మాధవన్ తెలిపాడు.
నిన్ననే అమీర్ ఖాన్ కి కరోనా రావడం ఆ తర్వాత రోజు ఈ రోజు మాధవన్ కి పాజిటివ్ రిపోర్ట్ రావడంతో ఈ వార్త సంచలనంగా మారింది. మాధవన్ పెట్టిన పోస్ట్ కి చాలా మంది సోషల్ మీడియాలో నెటిజన్లు స్పందిస్తూ నిజంగానే త్రీ ఇడియట్స్ సినిమా హీరోల ను మహామారి పగ పట్టినట్లు ఉందని కామెంట్లు పెడుతున్నారు. అంతే కాకుండా ఇద్దరు త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నారు.