భారతదేశంలో అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ దిగ్గజం హీరో మోటోకార్ప్.. ఇటీవల 100 మిలియన్ల ఉత్పత్తిని పూర్తి చేసినట్లు అధికారికంగా ప్రకటించింది..!! ద్విచక్ర వాహనాల ఉత్పత్తి లో ఒక భారతీయ కంపెనీ ఇంత పెద్ద సంఖ్యలో ఉత్పత్తి చేయడం నిజంగా భారత దేశానికి గర్వకారణం..!! ప్రపంచంలో అత్యధికంగా ద్విచక్ర వాహనాలు తయారు చేసిన సంస్థగా 20 ఏళ్లుగా తన అగ్రస్థానాన్ని హీరో మోటో కార్ప్ పదిలం చేసుకుంది..!! హరిద్వార్ లోని తమ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ నుంచి గురువారం 10 కోట్ల యూనిట్గా ఎక్స్ట్రీమ్ 160 ఆర్ బైక్ విడుదల చేసి విశిష్టతను సాధించినట్లు కంపెనీ తెలిపింది..
కంపెనీ ప్రారంభమైన 1984 నుంచి ఇప్పటి వరకు 10 కోట్ల ద్విచక్ర వాహనాలను తయారు చేసే గొప్ప రికార్డు సృష్టించింది.. భారతదేశం నుంచి ఈ రికార్డు సాధించిన తొలి వాహన సంస్థ గా హీరో మోటోకార్ప్ నిలిచింది. 1984వ సంవత్సరంలో మార్కెట్లోకి ప్రవేశించిన తర్వాత, అతి తక్కువ కాలంలోనే 1985 లో ప్లాంట్ ను ప్రారంభించి తన మొదటి మోడల్ సిడి 100 మోడెల్ ను పరిచయం చేసింది. 1987లో సుమారు ఒక లక్ష యూనిట్లను ఉత్పత్తి చేసింది. ఈ సంఖ్య క్రమక్రమంగా అభివృద్ధి చేసుకుంటూ 2004లో కంపెనీ 10 మిలియన్ల ఉత్పత్తి చేరుకుంది. 2013 లో 50 మిలియన్ల యూనిట్లను 2017 లో 75 మిలియన్ల సంఖ్యను దాటింది ఇప్పుడు ఏకంగా 100 మిలియన్లకు చేరుకుంది..
సంస్థ పట్టుదల, కలల ఫలానికి ఈ మైలురాయి చిహ్నమని.. హీరో మోటోకార్ప్ చైర్మన్ సీఈవో పవన్ ముంజాల్ ఈ సందర్భంగా పేర్కొన్నారు . ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆదరణ కంపెనీ సామర్థ్యానికి , ఇది నిదర్శనంగా నిలుస్తుందని వివరించారు.. రానున్న ఐదు సంవత్సరాల్లో కొత్త వేరియంట్లు , అప్డేట్స్ తో కలిపి ప్రతి సంవత్సరం 10 మోడళ్లను పరిచయం చేస్తామని తెలిపారు. ప్రపంచ అవసరాల కోసం భారత్లో వాహనాలను తయారు చేస్తున్నాం. అంతర్జాతీయంగా మరిన్ని దేశాలకు విస్తరిస్తోంది. రంగంలో కొత్త ప్రత్యామ్నాయ పరిష్కారాలు పై దృష్టి సారిస్తామని వివరించారు.