కరోనా మహమ్మారి అందరినీ వణికిస్తోంది. కరోనా బారిన అనేక మంది ప్రముఖులు చికిత్స అనంతరం కోలుకుంటుండగా పలువురు ఇంకా ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు. కొందరి పరిస్థితి ఆందోళన కరంగా తయారు అవుతోంది. తాజాగా కరోనా బారిన పడిన సినీ హీరో రాజశేఖర్ ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం.
పది రోజుల క్రితం రాజశేఖర్ కుటుంబంలో అందరికీ కరోనా సోకింది. ఈ విషయాన్ని రాజశేఖర్ స్వయంగా ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. రాజశేఖర్, ఆయన భార్య జీవిత, కుమార్తెలు శివానీ, శివాత్మికలు కరోనా బారిన పడగా చికిత్స అనంతరం కుమార్తెలు కోలుకున్నారు. అనంతరం జీవిత, రాజశేఖర్ లు ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు. కరోనా నుండి త్వరగా కొలుకుని ఇంటికి చేరుకుంటామని ఇటీవలే రాజశేఖర్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. అయితే బుధవారం రాత్రి నుండి ఆసుపత్రిలో రాజశేఖర్ కు శ్వాససంబంధమైన ఇబ్బందులు తలెత్తినట్లు తెలుస్తుంది. ఇన్సెంటివ్ కేర్ యూనిట్లో రాజశేఖర్ చికిత్స పొందుతున్నారు. రాజశేఖర్ త్వరగా కోలుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.
ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో విడుదలైన గరుడవేగ మువీ హిట్ కొట్టడంతో రాజశేఖర్ హీరోగా మళ్లీ బిజీ అయ్యారు. గత ఏడాది కల్కిక మువీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. రాజశేఖర్ నటించిన అర్జున్ సినిమా ఈ సమ్మర్ లో రిలీజ్ చేయాలని అనుకున్నప్పటికీ కరోనా కారణంగా ఈ సినిమా రిలీజ్ వాయిదా పడింది.