Pawan Shobhan Babu: తెలుగు సినిమా రంగంలో అందగాడు గా పేరొందిన హీరోలలో మొట్టమొదటి ప్రముఖుడు శోభన్ బాబు. అప్పట్లో ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ టైం లో శోభన్ బాబు కి మంచి లవర్ బాయ్ ఇమేజ్ ఉండేది. ఆంధ్రుల అందగాడు గా శోభన్ బాబు అప్పట్లో తన రింగ్ హెయిర్ స్టైల్..తో అనేక సినిమాలు చేసి ప్రేక్షకులను అలరించడం జరిగింది. ఎక్కువగా కుటుంబ కథా చిత్రాలు చేసి ఇ అనేకమంది ప్రేక్షకుల అభిమానం సంపాదించిన శోభన్ బాబు మహిళలలో మంచి ఫాలోయింగ్ సంపాదించారు. ఎంతో పేరుగాంచిన నటుడు కావడంతో శోభన్ బాబు తో అప్పట్లో చాలామంది హీరోలు నటించాలని పోటీ పడిన సందర్భాలు ఉన్నాయి. ముఖ్యంగా పవన్.. మహేష్.. ఎన్టీఆర్.. ఈ తరం వచ్చాక.. చాలామంది కుర్ర హీరోలు ఆయనతోపాటు సినిమాలు చేయాలని అనుకున్న టైంలో ఆయన తుది శ్వాస విడవడం జరిగింది. దీంతో అందరి కోరికలు ఆవిరైపోయాయి.
పరిస్థితి ఇలా ఉండగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా శోభన్ బాబు తో సినిమా చేసే అవకాశం అప్పట్లో రావడం జరిగిందట. పూర్తి విషయంలోకి వెళితే భీమినేని శ్రీనివాసరావు దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటించిన “సుస్వాగతం” సినిమా సూపర్ డూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ప్రేమకథా నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో తండ్రీ కొడుకుల రిలేషన్ నీ దర్శకుడు చాలా హైలెట్ గా చూపిస్తారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ తండ్రిగా ఈ సినిమాలో రఘువరన్ అదిరిపోయే యాక్టింగ్ చేయడం జరిగింది. అయితే రఘువరన్ కి ముందు ఈ సినిమా నిర్మాత ఆర్.బి.చౌదరి శోభన్ బాబు నీ పవన్ తండ్రిగా చేయాలని కోరడం జరిగింది అని లేటెస్ట్ సీక్రెట్ ఇండస్ట్రీలో బయటపడింది.
అయితే అప్పటికే తాను సినిమాలకు రిటైర్మెంట్ ఇవ్వడంతో శోభన్ బాబు నో చెప్పేశారట. ఈ రీతిగా పవన్ కెరీర్ ప్రారంభంలో “సుస్వాగతం” సినిమా కి.. నటించే ఛాన్స్ వచ్చినా కానీ శోభన్ బాబు.. వద్దని ఊహించని షాక్ ఇవ్వడం జరిగిందట. దీంతో ఆ తర్వాత ఆ క్యారెక్టర్ రఘువరన్ చేసి ప్రేక్షకులను ఎంతగానో అలరించారు. “సుస్వాగతం” లో మాత్రమే కాదు “అతడు” లో నాజర్ మహేష్ బాబు తాతగా నటించిన పాత్ర కూడా మొట్టమొదటిగా.. త్రివిక్రమ్.. శోభన్ బాబు కి తెలియ చెప్పారట. 60 సంవత్సరాలు వచ్చాక నటుడిగా రిటైర్ ఇచ్చాక… ఇక మరో సారి సినిమాలు చేసే ప్రసక్తే ఉండదని ఖరాఖండీగా చెప్పడం తో.. “అతడు” లో మహేష్ తాతగా నాజర్ చేయడం జరిగిందట. ఈ రీతిగా శోభన్ బాబు పవన్ కళ్యాణ్ తో పాటు మహేష్ సినిమాలు వదులుకున్నట్లు తాజాగా న్యూస్ బయటపడింది.