కోట్ల రూపాయల కుంభకోణాలను వెలికి తీసే పాత్రలలో నటించే ఒక పెద్ద హీరో తన ప్రొడక్షన్ హౌస్ లో పనిచేసే యువతి చేతిలో మోసపోయిన వైనం కోలీవుడ్ లో హాట్ టాపిక్ అయింది.
తమిళ పరిశ్రమలో మంచి ఫామ్లో ఉన్న విశాల్ ఓ యువతిపై ఫిర్యాదు చేయాల్సి వచ్చింది. విశాల్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితులే.పందెం కోడి ,అభిమన్యుడు,పూజ, డిటెక్టివ్ తదితర విశాల్ డబ్బింగ్ చిత్రాలు తెలుగులో కూడా విజయవంతమయ్యాయి.కాగా తాను తన బ్యానర్ లో చక్ర సినిమా తీస్తుండగా ఆమె పాల్పడిన మోసాలు బయటపడ్డాయని తెలిపాడు.
విశాల్ కంపెనీలో పనిచేసే సదరు మహిళ గత ఆరేళ్లలో రూ .45 లక్షలకు పైగా మోసం చేసి డబ్బు కూడపెట్టినట్టు..ఈ డబ్బుతో ఇల్లు కూడా కొన్నదట.ఈ విషయం తెలుసుకున్న ప్రొడక్షన్ హౌస్ మేనేజర్ హరి చెన్నైలోని వడపాలని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ఆమెపై కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్ పై పలు చిత్రాలను చాలా ప్లానింగ్ తో నిర్మిస్తూ బిజినెస్ మెన్ గా కూడా తన మార్క్ చూపిస్తున్న విశాల్ ని ఒక మహిళ మోసం చేయడం ఇప్పుడు కోలీవుడ్ లో చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం విశాల్ చక్ర సినిమాలో నటిస్తున్నాడు.ఇటీవల ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ విడుదలైంది. ఇది ఫ్యాన్స్ కి సంతోషాన్ని కలిగించింది.మరి హీరో గారు కూడా హ్యాపీ కావాలంటే పోగొట్టుకున్న డబ్బులు రికవరీ కావాల్సిందేగా?