మోడల్ గా కెరియర్ ప్రారంభించి.. వెండితెరపై తిరుగులేని కథానాయికగా ఎదిగిన నటి త్రిష. తన నటనా నైపుణ్యం తో దక్షిణాదిన స్టార్ హీరోయిన్ గా వెలుగొందారు. సినిమాల్లోకి రాక ముందు మోడల్ గా కొనసాగుతూ.. అందాల పోటీల్లో మిస్ చెన్నై గా ఎంపికయ్యారు. ఈ క్రమంలోనే మిస్ ఇండియా పోటీల్లో పాల్గొని మిస్ బ్యూటిఫుల్ స్మైల్ గా ఎంపికైంది త్రిష.
తెలుగు, తమిళ్, మలయాళం వంటి దక్షిణాది భాషల సినిమాల్లో నటించి సౌత్ లో అగ్ర హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న ఆమె.. దాదాపు సౌత్ స్టార్ హీరోల అందరితోనూ జాతకట్టి సినిమాలు చేశారు. టాలీవుడ్ నైతే దశాబ్దానికి పైగా ఏలారు. అయితే.. చాలా మంది హీరోయిన్లు తెలుగు తెరకు పరిచయం కావడంతో టాలీవుడ్ లో అవకాశాలు తగ్గిపోయాయి. దీంతో ఆమె.. తమిళ ఇండస్ట్రీపై దృష్టి సారించి.. లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో పాటు ప్రత్యేక పాత్రల్లో నటిస్తున్నారు.
అయితే, త్రిష కంటే తరువాత వెండితెర కు పరిచయమైన చాలా మంది హీరోయిన్లు ఇప్పటికే పెళ్లి చేసుకొని సెటిలయ్యారు. ఈ నేపథ్యంలోనే 37 ఏళ్లున్న ఆమె పెళ్లిపై చాలా సార్లు వార్తలు వచ్చాయి. ఇప్పటికీ వస్తూనే ఉన్నాయి. అయితే, గతంలో త్రిష… చెన్నై కి చెందిన ఒక బిజినెస్ మ్యాన్ తో నిశ్చితార్థం జరిగింది. కానీ పలు కారణాలతో పెళ్లి జరగకుండా ఆగిపోయింది. దీని తరువాత టాలీవుడ్ యంగ్ హీరో దగ్గుపాటి రానాతో త్రిష ప్రేమాయణం కొనసాగిస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. త్వరలోనే పెళ్లి జరగనుందని సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ కొనసాగింది.
అయితే, ఈ మధ్యే రానా వేరొకరిని పెళ్లి చేసుకోవడంతో ఆ టాపిక్ కు ఫుల్ స్టాప్ పడింది. ఈ మధ్య తమిళ హీరో శింబు, త్రిష పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు తెగ హల్ చల్ చేస్తున్నాయి. వీరిద్దరూ కలిసి చాలా సినిమాల్లో నటించారు. ఇటీవల వీరు కలిసి నటించిన షార్ట్ ఫిల్మ్ “కార్తిక్ డయల్ సేతా యెన్” షూటింగ్ సమయంలో వీరు ప్రేమలో పడ్డారనీ.. త్వరలో పెళ్లి అని వార్తలొస్తున్నాయి. దీనిపై వీరిద్దరూ ఇప్పటి వరకు స్పందించలేదు. కానీ పెళ్లి పై, తన లైఫ్ లోకి వచ్చే వారిని గురించి మాట్లాడుతూ.. తన వ్యక్తిగత విషయాలను, తన వృత్తిని, అభిప్రాయాలకు గౌరవాన్ని అందించే వాడిని పెళ్లి చేసుకుంటానని త్రిష చెప్పింది. అలాంటి వారు దొరకకపోతే పెళ్లి చేసుకొననీ, ఒంటరిగానే.. లైఫ్ లాంగ్ ఉండటానికి సైతం సిద్ధంగా ఉన్నట్టు షాకింగ్ వ్యాఖ్యలు చేసింది ఈ ముద్దుగుమ్మ.