Breaking: టాలీవుడ్(Tollywood) ఇండస్ట్రీ హీరోయిన్ హంసా నందిని(Hamsa Nandini) క్యాన్సర్ బారిన పడటం జరిగింది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతూ ఉండటంతో వైద్య పరీక్షలు చేయించుకోగా రొమ్ము క్యాన్సర్ గ్రేడ్-3 నిర్ధారణ అయింది. దీంతో హంసానందిని కీమోథెరపీ చికిత్స తీసుకుంటూ ఉంది. ఈ విషయాన్ని స్వయంగా హంసానందిని సోషల్ మీడియాలో తెలియజేసింది. “ప్రతి దినం నీ దర్శనం” అనే పాట ద్వారా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలు అయ్యింది.
అనేక సినిమాలలో కుర్ర హీరోలతో నటించిన హంసానందిని… ఐటెం సాంగ్స్ లో కూడా చిందులేసి హాట్ క్రేజీ హీరోయిన్ గా గుర్తింపు దక్కించుకుంది. ఒక్కసారిగా క్యాన్సర్ అని హంసానందిని పెట్టిన పోస్ట్ ఆమె అభిమానులను ఎంతగానో కలవరపెడుతోంది. ఈ వార్త టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. అంతమాత్రమే కాకుండా డా.మర్రి సినిమాల్లో నటిస్తానని ఖచ్చితంగా క్యాన్సర్ ను జయిస్తా అని ధీమా వ్యక్తం చేసింది హంసానందిని. గతంలో హీరోయిన్ సోనాలి బింద్రే(Sinali Bindre) క్యాన్సర్ బారిన పడటం జరిగింది. తర్వాత ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో హంసానందిని బ్రస్ట్ క్యాన్సర్ బారిన పడటం సంచలనంగా మారింది.