Heroines: సినిమాను ఎంతో జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటాడు నిర్మాత. సాధారణంగా ఏ నిర్మాత సొంత ఆస్థులను అమ్మి గానీ.. సొంత డబ్బు మొత్తం పెట్టి గానీ సినిమా నిర్మించలేడు. టాలీవుడ్లో ఆ తరం అగ్ర నిర్మాతలు మూవీ మొఘల్ డా.డి.రామానాయుడు, సూపర్ స్టార్ కృష్ణ లాంటి వారు కూడా కొంత మొత్తాన్ని ఫైనాన్సర్ వద్ద తీసుకొనే సినిమాలను నిర్మిస్తారు. ఇక సినిమా నిర్మాణానికి తీసుకునే రుణాల వడ్డీ కూడా భారీగా ఉంటుంది. ఇప్పుడు టాలీవుడ్లో అగ్ర నిర్మాతలుగా వెలుగుతున్న దిల్ రాజు, అల్లు అరవింద్, డీవీవీ దానయ్య, అశ్వనీదత్, సురేశ్ బాబు లాంటి వారే కొన్ని భారీ బడ్జెట్ సినిమాలకి భారీ మొత్తాన్ని వడ్డీకి తీసుకొచ్చుకొని సినిమాలను నిర్మిస్తున్నారు.
ఇక నిర్మాత నమ్మేది కథను దాన్నీ తెరమీదకి తీసుకువచ్చే దర్శకుడిని. కెప్టెన్ కుర్చీలో మెగా ఫోన్ పట్టుకునే దర్శకుడిదే సినిమాకి సంబంధించిన పూర్తి బాద్యత. సినిమా రిజల్ట్ ఏమాత్రం తేడా కొట్టినా ముందుగా ఎఫెక్ట్ అయ్యేది నిర్మాతే. ఆ తర్వాత దర్శకుడిది. ఇక ఆ తర్వాత సినిమా మార్కెట్ పరంగా ఎక్కువగా ప్రభావం చూపించేది హీరో, హీరోయిన్స్ మీదే. కొన్ని క్రేజీ కాంబినేషన్స్లో సినిమా అంటే ప్రతీ ఒక్కరిలో ఉండే అంచనాలు తారా స్థాయిలోనే. అలాంటి అంచనాలున్న జంటలనే ఏ ఇండస్ట్రీలోనైనా మేకర్స్ తీసుకునేది.
Heroines: కొందరు హీరోయిన్స్ మీద అధికారులు ఫోకస్ పెట్టి పంజా విసిరారు.
అయితే గత కొంతకాలంగా కొందరు హీరోయిన్స్ ప్రవర్తనల వల్ల సినిమా ఇబ్బందుల్లో పడుతోందని ఇండస్ట్రీ వర్గాలలో టాక్ వినిపిస్తోంది. అదే గత కొంతకాలంగా అన్నీ సినిమా ఇండస్ట్రీలను పట్టి పీడిస్తున్న డ్రగ్స్ వ్యవహారం. అంతకముందు టాలీవుడ్లో ఈ వ్యవహారంతో పెద్ద సంచలనం అయింది. విచారణలు జరిగాక దీనికి సంబంధించిన ఎలాంటి హడావుడి లేదు. అయితే గత ఏడాది నుంచి మళ్ళీ ఇదే వ్యవహారం తెరమీదకి వచ్చి ఇటు టాలీవుడ్ అటు బాలీవుడ్ ఇండస్ట్రీలతో పాటు సౌత్ ఇండస్ట్రీలోనూ పెద్ద ప్రకంపణలు కలిగించింది. దీంతో కొందరు హీరోయిన్స్ మీద అధికారులు ఫోకస్ పెట్టి పంజా విసిరారు.
డ్రగ్స్, మనీ లాండరింగ్ లాంటి వ్యవహారాలలో అటు బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్, యంగ్ హీరోయిన్స్ ఇటు టాలీవుడ్లో సినిమాలు చేస్తున్న స్టార్ హీరోయిన్స్ పేర్లు వెలుగులోకి వచ్చాయి. గత ఏడాది దీనికి సంబంధించిన వ్యవహారంలోనే రకుల్ కొండపొలం షూటింగ్లో ఉండి కూడా ముంబై టు హైదరాబాద్ పలుమార్లు విచారణ నిమిత్తం తిరగాల్సి వచ్చింది. ఆ సమయంలో రకుల్ నటిస్తున్న తెలుగు, హిందీ సినిమాల పరిస్థితేంటో అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. దాంతో చిత్ర దర్శక నిర్మాతలలో కొంత అలజడి కలిగింది కూడా. అయితే ఆమె ఎలాంటి తప్పు చేయని కారణంగా సమస్య సద్దుమణిగింది.
Heroines: అనన్య పాండే విషయంలో ఏం జరుగుతుందో..?
ఇప్పుడు తాజాగా పూరి జగన్నాధ్ విజయ్ దేవరకొండతో తెరకెక్కిస్తున్న లైగర్ మూవీ హీరోయిన్ మీద అభియోగాలు వస్తున్నాయి. తాజాగా ఆమెను ఇలాంటి వ్యవహారంలోనే ఈడీ అధికారులు విచారణ జరుపుతున్నారు. ఈ క్రమంలోనే లైగర్ హీరోయిన్ అనన్య పాండే మొబైల్ ఫోన్, లాప్టాప్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దాంతో ఇప్పుడు ఆ ప్రభావం లైగర్ సినిమా మీద పడుతుందా అని టాక్ మొదలైంది. ఇదే నిజమైతే పూరి అండ్ టీంకి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందంటున్నారు. చూడాలి మరి అనన్య పాండే విషయంలో ఏం జరుగుతుందో. ఏదేమైనా ఈ వ్యవహారంలో కొందరు హీరోయిన్స్ దర్శక, నిర్మాతలకు చుక్కలు చూపిస్తున్నారు.