తెలంగాణ సచివాలయం కూల్చివేతకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందుకు సంబంధించి ప్రభుత్వ వాదనలు విన్న హైకోర్టు వారితో ఏకీభవించింది. సచివాలయం కూల్చివేయొద్దని గతంలో దాఖలైన పిటిషన్లను హైకోర్టు కొట్టేసింది. దీంతో కొత్త సచివాలయ నిర్మాణానికి అనుమతి లభించినట్టైంది. ప్రస్తుతం ఉన్న సచివాలయం కూల్చివేత నిర్ణయాన్ని అడ్డుకుంటూ వేర్వేరుగా దాఖలైన 10 పిటిషన్లను హైకోర్టు విచారించింది.
కొన్ని రోజులుగా హైకోర్టులో దీనిపై వాదనలు జరుగుతున్నాయి. కొత్త సచివాలయ నిర్మాణం కోసం కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపట్టలేమని హైకోర్టు వివరించింది. ఇప్పటికే సెక్రటేరియట్ లోని పలు కార్యాలయాలు వేర్వేరు భవనాలకు తరలింపు జరిగాయి. హైకోర్టు తీర్పుతో కొత్త సచివాలయం నిర్మించేందుకు తెలంగాణ ప్రభుత్వానికి అడ్డంకులు తొలగిపోయాయి.