కరోనా నేపథ్యంలో ప్రైవేటు ఆసుపత్రులు ట్రీట్మెంట్ పేరుతో చుక్కలు చూపిస్తున్న నేపథ్యంలో హైకోర్టులో ఈరోజు పిల్ దాఖలైంది. యశోద, కేర్, సన్ షైన్, మెడికవర్ వంటి ప్రైవేట్ ఆసుపత్రులు కరోనా బాధితులకు వైద్యం చేసి లక్షల్లో బిల్లులు ఇస్తుండడంతో సామాన్యుడికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
ఈ విషయంలో ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసినా కానీ ప్రైవేటు ఆసుపత్రులు వాటిని అవలంబించడంలేదని దాఖలైన పిటీషన్ లో పేర్కొన్నారు. కరోనా టెస్టులు, చార్జీల నియంత్రణ విషయంలో మార్గదర్శకాలు జరీ చేయాలని పిటిషన్ లో కోరారు. ఈ నోటీసుల నేపథ్యంలో 14 లోగా ప్రభుత్వం వివరణ ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. ప్రైవేటు ఆసుపత్రులను నియంత్రించడానికి కరోనా ట్రీట్మెంట్ కు క్యాప్ పెట్టింది ప్రభుత్వం. అయితే అది కార్యరూపం మాత్రం దాల్చట్లేదు.