అమరావతి భూముల వ్యవహారంలో హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. మాజీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ రాజధాని భూముల్లో అక్రమాలకు పాల్పడ్డారంటూ ఏసీబీ కేసు నమోదు చేసిన విషయం తెల్సిందే. దమ్మాలపాటి ఈ కేసులో హౌస్మోషన్ పిటిషన్ దాఖలు చేయగా ఈ పిటిషన్పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది.
దమ్మాలపాటి తరుఫున ముకుల్ రోహత్గీ, శ్యాందివాన్ వాదనలు వినిపించారు. దమ్మాలపాటి శ్రీనివాస్ ను ఇరికించేందుకు ఉద్దేశ్యపూర్వకంగానే అభియోగాలు మోపారని ఆధారాలతో సహా పిటీషనర్ తరుఫు న్యాయవాదులు వాదించారు. ఈ కేసులో ఆంధ్ర ప్రదేశ్ హై కోర్టు స్టే విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి చర్యలు నిలిపివేయాలని ధర్మాసనం స్పష్టం చేసింది. అలాగే ఎఫ్ఐఆర్ లోని సమాచారాన్ని ప్రసార మాధ్యమాల్లో ప్రసారం చేయకూడదని ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు.