ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ మరోమారు హైకోర్టు ఎదుట హాజరు కాబోతున్నారు. మద్యం అక్రమంగా తరలిస్తున్న వ్యవహారంలో పట్టుబడ్డ వాహనాలు అప్పగింత లో ఎక్సైజ్ అధికారులు తీవ్ర జాప్యం చేస్తున్నారు అంటూ హైకోర్టులో ఇటీవల పిటిషన్ దాఖలైంది. అయితే ఈ వ్యవహారంలో ఎక్సైజ్ అధికారుల తరుపున హైకోర్టుకు హాజరైన ఏజీ వివరణతో హైకోర్టు ధర్మాసనం సంతృప్తి చెందలేదు.
దీంతో రాష్ట్ర డిజిపి స్వయంగా హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. గతంలో చంద్రబాబును విశాఖలో పర్యటించకుండా వెనక్కి పంపిన వ్యవహారంలో హైకోర్టులో హాజరై వివరణ ఇచ్చారు డీజీపీ. తాజాగా మద్యం బాటిల్స్ ప్రభుత్వ నిబంధనల మేరకు తీసుకెళ్తే ఆ వాహనాలను ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం చేసుకునే దాని విషయములో ఏపీ డీజీపీ హైకోర్టులో హాజరవ్వాలని స్వయంగా వివరణ ఇవ్వాలని తెలపడం జరిగింది. దీంతో ఏపీ డీజీపీ తాజా ఆదేశాల మేరకు హైకోర్టు కి ఇప్పటిదాకా ప్రభుత్వ విధానాల పరంగా మూడోసారి వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ విషయం ఏపీ రాజకీయాల్లో పెద్ద హాట్ టాపిక్ అయింది. వైసీపీ ప్రభుత్వం చేస్తున్న తప్పులకి ప్రభుత్వ అధికారులు బలైపోతున్నారు అని విపక్షాలు అంటున్నాయి.