అమరావతి: అభివృద్ధి వికేంద్రీకరణతో సహా కీలకమైన ప్రాజెక్టులపై నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికలను అధ్యయనం చేసేందుకు ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి నేతృత్వంలో ఏర్పాటైన హైపవర్ కమిటీ ఈ నెల ఆరవ తేదీన సచివాలయంలో తొలిసారిగా భేటీ అవ్వనుంది. రాజధానిపై జిఎన్ రావు కమిటీ ఇప్పటికే నివేదిక సమర్పించగా, బిసిజి నివేదిక శుక్రవారం ముఖ్యమంత్రికి అందజేస్తుంది.
ఈ రెండు కమిటీల నివేదికలను హైపవర్ కమిటీ అధ్యయనం చేసి మూడు వారాల్లో ప్రభుత్వానికి నివేదిక అందజేయాల్సి ఉంది. రాజధాని అంశంపై రాష్ట్రంలో ఉత్కంఠత నెలకొన్న నేపథ్యంలో హైపవర్ కమిటీ ఏ నిర్ణయం తీసుకుంటుందో అని అందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు.
ఈ కమిటీలో మంత్రులు పేర్ని నాని, కొడాలి నాని, పిల్లి సుభాష్ చంద్రబోస్, బొత్స సత్యనారాయణ, గౌతమ్రెడ్డి, కె కన్నబాబు, మేకతోటి సుచరిత, మోపిదేవి వెంకట రమణ, సిఎం జగన్ ముఖ్య సలహాదారు అజయ్ కల్లం, డిజిపి,, సిసిఎల్ఏ, పురపాలక శాఖ కార్యదర్శులు సభ్యులుగా ఉన్నారు. హైపవర్ కమిటీ కన్వీనర్గా సిఎస్ నీలం సాహ్ని వ్యవహరిస్తున్నారు.