విశాఖపట్నంలో ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజ్ సంచలనం సృష్టించిన విషయం తెల్సిందే. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ ఘటనపై హైపవర్ కమిటీను నియమించారు. ప్రమాదానికి గల కారణాలను అధ్యయనం చేసిన ఈ కమిటీ ప్రమాదానికి గల కారణాలు ఏంటి?
అందులో యాజమాన్యం నిర్లక్ష్యం ఎంతమేర ఉంది? భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? వంటివన్నీ పొందుపరిచి ఒక నివేదికను వైఎస్ జగన్ కు ఈరోజు సమర్పించారు. కమిటీ చైర్మన్ నీరబ్ కుమార్ ప్రసాద్, కమిటీ సభ్యుడు కరికాల వలవన్ ఈరోజు సీఎం క్యాంపు కార్యాలయంలో నివేదిక సమర్పించారు. నివేదికలో ఏం పొందుపరిచారు అన్న ఆసక్తి అందరిలోనూ ఉంది. జగన్ ఈ నివేదికను పరిశీలించిన తర్వాత తగిన నిర్ణయం తీసుకుంటారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?