(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
కాకినాడ: వైసిపి, జనసేన కార్యకర్తల రాళ్లదాడితో తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై కాకినాడ వైసిపి ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ అసభ్య వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఆయన క్షమాపణ చెప్పాలంటూ భానుగుడి సెంటర్ వద్ద జనసేన కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. ఎమ్మెల్యే నివాసాన్ని ముట్టడించేందుకు జనసేన కార్యకర్తలు బయలుదేరగా పోలీసులు అడ్డుకున్నారు. కొందరు జనసేన కార్యకర్తలు ఎమ్మెల్యే నివాసం వద్దకు చేరుకోగా వారిపై వైసిపి కార్యకర్తలు రాళ్లు, కర్రలతో దాడి చేశారు. దీంతో జనసేన కార్యకర్తలూ రాళ్లతో ప్రతిదాడి చేశారు. దాడిలో పలువురు జనసేన కార్యకర్తలకు గాయాలు అయ్యాయి. తీవ్ర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడటంతో స్పెషల్ బ్లాంచి పోలీసులు భారీగా మోహరించారు. కొందరు జనసేన నాయకులు, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. ఎమ్మెల్యే చంద్రశేఖర్ను అరెస్టు చేయాలంటూ జనసేన నాయకులు డిమాండ్ చేశారు.