ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఎంత పంతానికి పోయినా కూడా… అతనికి ఈ మధ్యకాలంలో ప్రతి విషయంలో ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ప్రతిపక్షాలు జగన్ నిర్ణయాలపై మరియు అతని భవిష్యత్తు పై పెద్దగా ప్రభావం చూపించలేకపోతున్నా అవసరమైనప్పుడల్లా అతనికి చావు దెబ్బ కొట్టేందుకు హైకోర్టు సంసిద్ధంగా ఉంటోంది. జగన్ ఇంగ్లీష్ మీడియం కలను నిలిపివేసిన తర్వాత కేంద్రం నూతన విద్యా విధానం తీసుకువచ్చేందుకు సమయం కల్పించి జగన్ ను దిక్కుతోచని స్థితిలో నిలబెట్టిన హైకోర్టు తాజాగా మూడు రాజధానులు బిల్లు అమలు పై స్టే విధించడం చూశాం.
ఇకపోతే చాలా రోజుల నుండి ఆంధ్రప్రదేశ్ లో న్యాయస్థానమే ప్రధాన ప్రతిపక్షంగా వ్యవహరిస్తోంది అన్న ఆరోపణలు చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు తాజాగా బయటకు వస్తుంది అంశం ఏమిటంటే జగన్ రాజ్యాంగబద్ధమైన పద్ధతిలోనే మూడు రాజధానుల బిల్లుని అమలు చేస్తున్నప్పటికీ… గవర్నర్ దీనిపై ఆమోదం తెలిపిన తర్వాత కూడా స్టే విధించడం ఇప్పుడు వైసిపి పార్టీ వర్గాలకు మింగుడు పడడం లేదు. ఇకపోతే ఇప్పుడు మరో కొత్త విషయం తెరమీదకు వచ్చింది. ప్రతిపక్షాలు హైకోర్టు నిర్ణయాలను పెద్దగా ప్రభావితం చేయలేకపోతున్నాయని…కాని కోర్టు వారు మాత్రం తన సొంత అజెండాతో ముందుకు వెళ్తోందని అంటున్నాడు.
ముఖ్యంగా వైసీపీ వర్గాల నుండి మరియు ఇతర నిపుణుల నుండి వస్తున్న వాదనలు ఏమిటంటే హైకోర్టులో ఉండే న్యాయస్థానం, జడ్జిలు మరియు ఇతర సిబ్బంది కర్నూల్ కి వెళ్ళేందుకు ఇష్టపూర్వకంగా లేరట. ఇక జగన్ మూడు రాజధానుల బిల్లును అమలు చేస్తే తప్పనిసరి పరిస్థితుల్లో అక్కడికి వెళ్ళవలసి వస్తుంది కాబట్టి సాధ్యమైనంతగా ప్రతిపక్షాలకు సహకరించేందుకు మొగ్గుచూపుతున్నారని తీవ్రమైన ఆరోపణలు వస్తున్నాయి. దేశంలో న్యాయస్థానం పై ఇటువంటి ఆరోపణలు రావడం నిజంగా దురదృష్టకరం. చట్టం ఎవరి చుట్టం కాదు… పైగా హై కోర్టు ఇప్పటివరకు తీసుకున్న నిర్ణయాల్లో అది స్పషంగా కనిపించిందనే ప్రజలు నమ్ముతున్నారు.
రేపు మరి హైకోర్టు జగన్ నిర్ణయాన్ని వ్యతిరేకించి.. పూర్తి గా కొట్టిపారేసినా సరే…. కానీ అందులో మరియు నిర్దిష్టమైన కారణం లేకుండా ఉంటే మాత్రం ప్రజలు వైసీపి వారి వాదనకే ఫిక్స్ అయిపోతారు అనడంలో ఎలాంటి సందేహం లేదు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?