జొన్నలగడ్డ చైతన్య మరియు నిహారికల వివాహం డిసెంబర్ 9వ తేదీన రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ ప్యాలస్ లో జరగనున్నది. ఇది మెగా ఫ్యామిలీలో భారీ వేడుకగా నిలిచిపోనున్నది. తన ముద్దుల కూతురి పెళ్లి అంగరంగ వైభవంగా నాగబాబు జరపనున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే పెళ్లి పనులు దాదాపుగా పూర్తికావచ్చాయి. మెగా ఫామిలీ ముందుగానే రాజస్థానుకు చేరుకొని పెళ్లి పనులు చూసుకుంటున్నారు.
నిన్న నిహారిక తన తల్లి పద్మజ కొణిదెల నిశ్చితార్ధ చీరను కట్టుకుని సోషల్ మీడియా లో చేసిన పోస్ట్ వైరల్ అయ్యింది. ఆ పోస్ట్ లో ‘మా అమ్మ నిశ్చితార్ధ చీర’ మరియు ‘32 సంవత్సరాల క్రితం చీర’ అని డిస్క్రిప్షన్ లో రాసింది. స్కై బ్లూ కలర్ మరియు నేవీ బ్లూ అంచుమీద బంగారు రంగుతో డిజైన్ కలిగిన ఆ చీరలో నిహారిక కుందనపు బొమ్మలా ఉన్నదీ.
చిరంజీవి నిన్నటి షూటింగ్ పూర్తిచేసుకుని నిన్న రాత్రి ఉదయపూర్ చేరుకున్నారు. రామ్ చరణ్, అల్లు అర్జున్, సాయి ధరమ్ తేజ్ లు ఏ రోజు ఉదయపూర్ చేరుకోనున్నారు. నిన్న రాత్రి చిరంజీవి నిహారికతో సెల్ఫీదిగారు. కొత్త పెళ్లి కూతురితో చిరు దిగిన సెల్ఫీను నాగబాబు తన సోషల్ మీడియా లో పోస్ట్ చేశారు. ఇపుడు ఆ సెల్ఫీ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ ఫొటోకు ‘ఆయన ప్రేమ…సమయం, వయసు అనే సరిహద్దులు దాటింది. ఆయన చిరు నవ్వు ప్రతి క్షణం వేడుకలా మారుస్తుంది’ అంటూ నాగబాబు ఓ ఎమోషనల్ నోట్ పెట్టాడు. చిరంజీవి మెగా డాటర్ కు పెళ్లి గిఫ్ట్ గా కోటి రూపాయలకు పైగా విలువైన వస్తువును సిద్ధం చేసినట్లు సమాచారం.
ఉదయ్ పూర్ ప్యాలస్ లో జరగనున్న పెళ్లి వేడుకకు మెగా కుటుంబం మొత్తం హాజరు కానుంది. చరణ్, అల్లు అర్జున్ త్వరలోనే సతీసమేతంగా పెళ్ళికి హాజరుకానున్నారు. పవన్ కళ్యాణ్ ఈ రోజు తన పరియటన పూర్తిచేసుకుని ఉదయపూర్ చేరుకోనున్నట్లు సమాచారం. గతంలో నిశ్చితార్ధ వేడుకకు కూడా పవన్ కళ్యాణ్ హాజరు కాలేకపోవడంతో పెళ్ళికి తప్పకుండా పవన్ హాజరయ్యేలా నాగబాబు ఏర్పాట్లు చేశారట.