టాలీవుడ్ లో సూపర్ స్టార్ గా మహేష్ బాబు కి ఉన్న రేంజ్ అండ్ క్రేజ్ ఏంటో అందరికీ తెలిసిందే. చెప్పాలంటే హాలీవుడ్ హీరోలా ఉంటాడు. అందుకే మహేష్ బాబు నుంచి అందరూ జేంస్ బాండ్ తరహా సినిమాలు వస్తే చూడాలని భావిస్తున్నారు. కాగా ఈ ఏడాది ప్రారంభంలోనే సరిలేరు నీకెవ్వరు సినిమాతో అద్భుతమైన కమర్షియల్ సక్సస్ ని అందుకున్నాడు మహేష్.
ఇక ప్రస్తుతం నటించబోతున్నసినిమా ‘సర్కారు వారి పాట’. మహేష్ బాబు కెరీర్ లో రాబోయో 27 వ సినిమాగా రూపొందనుండగా పరశురాం దర్శకత్వం వహిస్తున్నాడు. మహేష్ సొంత నిర్మాణ సంస్థ జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్ ..14 రీల్ ఎంటర్టైన్మెంట్స్ .. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
కాగా తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాలో విలన్ గా ఒకప్పటి కోలీవుడ్ స్టార్ హీరో అరవింద స్వామి నటించబోతునట్లు తెలుస్తోంది. అరవింద స్వామికి తెలుగులో కూడా క్రేజ్ ఉంది. మెగా పవర్ స్టార్ రాం చరణ్ నటించిన ధృవ సినిమాలో క్లాస్ విలన్ గా అద్భుతంగా నటించాడు. అందుకే ఇప్పుడు సర్కారు వారి పాట కి అరవింద స్వామి ని ఎంచుకున్నారట.
ధృవ సినిమా తర్వాత అరవింద స్వామి కి తెలుగులో వరసగా అవకాశాలు వచ్చినప్పటికి భారీగా రెమ్యూనరేషన్ డిమాండ్ చేయడం తో మేకర్స్ కాదనుకున్నారట. ఇప్పుడు సర్కారు వారి పాటి కి తీసుకుంటున్నారంటే ఖచ్చితంగా భారీగా రెమ్యూనరేషన్ ముట్టచెబుతున్నట్టు తెలుస్తుంది.
ఎస్ ఎస్ థమన్ సంగీతమందిస్తున్న ఈ సినిమాలో కీర్తి సురేష్, బాలీవుడ్ బ్యూటీ సాయీ మంజ్రేకర్ హీరోయిన్స్ గా నటించనున్నారట. నవంబర్ నుంచి ఈ సినిమా నాన్ స్టాప్ గా చిత్రీకరణ జరుపుకోనుందని సమాచారం. ఇక సమ్మర్ సెషల్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. మొత్తానికి సర్కారు వారి పాట కి పాన్ ఇండియన్ సినిమాకి కావాలసిన గ్రాండ్ నెస్ తీసుకు వస్తున్నారు మేకర్స్.