Home Appliances : 2020-21 బడ్జెట్ లో కస్టమ్స్ డ్యూటీ పెంచుతూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.. 1 ఏప్రిల్ 2021 నుంచి ఎయిర్ కండిషనర్, టెలివిజన్, రేఫిజిరేటర్, మొబైల్ ఫోన్స్ , LED లైట్స్ తదితర కన్స్యూమర్ డ్యూరబుల్ కంపెనీలు ధరలు పెంచేందుకు సిద్ధమవుతున్నాయి.. దీంతో వినియోగదారులపై భారం పడనుంది.. ఇప్పటికే కొన్ని కంపెనీలు ధరలు పెంచాయి..
* వచ్చేది ఎండాకాలం హాయిగా ఏసీ కొనుకుందాం అనుకునే వారికీ వేడి కబురు.. రేఫిజిరేటర్, ఎయిర్ కండిషనర్, వాషింగ్ మెషిన్ ధరలు ఏప్రిల్ నుండి పెరగనున్నాయి. వీటి ధరలు 4 – 8 శాతం వరకు పెరగనున్నాయి. ఏసీ లకు ఉపయోగించే మోటర్లు , కంప్రెషర్ల పైన బేసిక్ కస్టమ్స్ డ్యూటీ 2.5 శాతం పెంచారు. దీని వలన ఆయా సంస్థలు తమ ఉత్పత్తుల పై ధరలు పెంచనున్నాయి.
* ఆపిల్ సంస్థ కస్టమ్స్ డ్యూటీ పెరగనున్న నేపథ్యంలో తన ఐఫోన్ మోడల్స్ iPhone 11 pro ,11 pro max , iPhone 8 వంటి వాటి పై ఇప్పటికే రూ. 600 నుంచి రూ. 1300 వరకు పెంచింది.
* వినియోగదారులు ఎయిర్ కండిషనర్, టెలివిజన్, రేఫిజిరేటర్, మొబైల్ ఫోన్స్ , LED లైట్స్ కొనుగోలు చేయాలనీ ఆలోచిస్తున్నట్లైతే 31 మార్చి 2021 లో కొనటం మంచిది. లేదంటే ఏప్రిల్ నుంచి అదనపు భారం లో కలిపి కొనాలిసి వస్తుంది..