చాలామంది ఉద్యోగులు కానీ.. చిన్నా చితకా వ్యాపారాలు చేసుకునే వాళ్లు కానీ.. పెద్ద పెద్ద వ్యాపారులు కానీ.. ఎవ్వరైనా కానీ.. బ్యాంక్ నుంచి మాత్రం అప్పుడో ఇప్పుడో రుణం తీసుకుంటారు. అది పర్సనల్ లోన్ కావచ్చు… హోమ్ లోన్ కావచ్చు.. వెహికిల్ లోన్ కావచ్చు.. ఇంకేదైనా కావచ్చు. లోన్ తీసుకున్నాక.. ఈఎంఐ పద్ధతుల్లో తిరిగి లోన్ ను చెల్లిస్తుంటారు.
అయితే.. కరోనా పుణ్యమాని తీసుకున్న లోన్ల ఈఎంఐలు కట్టలేని పరిస్థితి అందరికీ ఏర్పడింది. దీంతో ఆర్బీఐ అన్ని రకాల రుణాల ఈఎంఐల మీద మారటోరియం విధించింది. అంటే… మారటోరియం ఉన్నంతవరకు ఈఎంఐ కట్టాల్సిన పనిలేదు. ఒకసారి మారటోరియం ముగిశాక మళ్లీ యథావిథిగా ఈఎంఐని పే చేయాలి. అయితే.. ఈనెల అంటే అగస్టు 31 వరకే ఆర్బీఐ అన్ని రకాల రుణాల మీద మారటోరియం విధించింది.
మార్చిలో లాక్ డౌన్ విధించాక.. ఏప్రిల్, మే, జూన్ కు కలిపి మూడు నెలల పాటు ఆర్బీఐ రుణాల మీద మారటోరియం విధించింది. ఆ తర్వాత మారటోరియాన్ని పెంచుతూ వచ్చింది.
అయితే.. ఆగస్టు 31 తర్వాత ఈఎంఐల పరిస్థితి ఏంటి.. అనేదానిపై ఇంకా ఆర్బీఐ నుంచి సమాచారం వెలువడనప్పటికీ… హోమ్ లోన్ తీసుకున్న వారికి మాత్రం ఆర్బీఐ గుడ్ న్యూస్ చెప్పనుందట.
హోం లోన్ తీసుకున్న వాళ్లకు ఆర్బీఐ లోన్ రిస్ట్రక్చరింగ్ చేసుకున్న ఫెసిలిటీని అందించనున్నదట. అంటే లోన్ రిస్ట్రక్చరింగ్ వల్ల కస్టమర్లు ఈఎంఐ డిఫర్ మెంట్ ఫెసిలిటీని పొందొచ్చు. దీన్ని ఎంచుకుంటే… సడెన్ గా ఆదాయం కోల్పోయిన కస్టమర్లు కొన్ని నెలల పాటు ఈఎంఐ చెల్లించాల్సిన అవసరం ఉండదన్నమాట. కాకపోతే ఎన్ని నెలలు ఈఎంఐ చెల్లించలేదో… అన్ని నెలలకు వడ్డీని కాలుక్యులేట్ చేసి అసలుకు కలుపుతారు. అంటే వడ్డీ భారాన్ని మోయాలన్నమాట. అయితే దీనిపై ఇంతవరకు ఆర్బీఐ నుంచి ఎటువంటి ప్రకటనా రాలేదు. కాకపోతే త్వరలోనే హోం లోన్ తీసుకున్న వాళ్లకు ఆర్బీఐ ఈ తీపి కబురును అందించనున్నదని సమాచారం.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?