NewsOrbit
న్యూస్

తేనె ఉపయోగం ఆరోగ్యం కాదు అనారోగ్యమే….అంటున్న అధికారులు

 

 

దాబర్, పతంజలి, జండూ వంటి ప్రముఖ సంస్థలు విక్రయిస్తున్న తేనె కల్తీ అవుతోందని ఇటీవల నిర్వహించిన పరీక్షల్లో వెల్లడయిన విషయం తెలిసిందే. తాజాగా, దీనికి సంబంధించిన వివరాలను సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్ (సీఎస్ఈ) శుక్రవారం వెల్లడించింది. ప్రముఖ బ్రాండ్లు విక్రయిస్తున్న తేనెల్లో కల్తీకి సంబంధించి తాము జరిపిన పరిశోధనల వివరాలను భారత ఆహార భద్రత, ప్రమాణాల సంస్థ(ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ)కి అందజేసినట్లు తెలిపింది. తేనె కల్తీ జరుగుతోన్న తీరును బయటపెట్టేందుకు తాము అనుసరించిన విధానాలన్నిటినీ సంస్థ అధికారులకు వివరించామని సీఎస్‌ఈ వివరించింది.

honey

కోవిడ్ -19 మహమ్మారి సమయంలో తేనె అమ్మకాలు పెరిగినప్పటికీ ఉత్తర భారతంలో తేనెటీగల పెంపకదారులు లాభాలు క్షీణించాయి, దీంతో దర్యాప్తు ప్రారంభించినట్లు సీఎస్‌ఈ డైరెక్టర్ జనరల్ సునీతా నరైన్ తెలిపారు. భారతీయ మార్కెట్లో అమ్మబడుతున్న దాదాపు అన్ని బ్రాండ్ల తేనె చక్కెర సిరప్‌తో కల్తీగా ఉందని సిఎస్‌ఇ అధ్యయనం కనుగొంది. తేనె లో చక్కర సిరప్ కలవడంతో తేనెకు బదులుగా, ప్రజలు ఎక్కువ చక్కెరను తింటున్నారు, ఇది కోవిడ్ -19 ప్రమాదాన్ని పెంచుతుంది అని సునీతా నరైన్ చెప్పారు. శీతల పానీయాలపై 2003,2006లో చేపట్టిన పరిశోధనలో బయటపడిన దానికంటే దుర్మార్గమైన, దారుణమైన మోసాన్ని గుర్తించామని తెలిపారు. అత్యంత ఘోరమైన, అధునాతన కల్తీ ఇదేనని , ఇప్పటివరకు గుర్తించినదానికంటే ఇది చాలా ఎక్కువ హానికరమని తెలిపారు.

sunitha narian

కోవిడ్ -19 యొక్క సమస్యాత్మక సమయాల్లో ఇది ఆరోగ్యాన్ని మరింత పాడు చేస్తుంది అని, దీని వల్ల చాల అనారోగ్య పరిస్థితులు తలెత్తుతాయని,అందువలె ఈ విషయం చాలా ఆందోళన కలిగిస్తుంది అని ఆమె చెప్పారు. యాంటీమైక్రోబయాల్,యాంటీ ఇన్ఫ్లమేటరీ వంటి గుణాలు మనిషి శరీరానికి ఎంతో ఉపయోగపడే కారణంగా నేడు చాలా మంది ప్రజలు ఎక్కువ తేనెను వినియోగిస్తున్నారు, ఇది చాల ప్రమాదకరం ”అని నరైన్ చెప్పారు.

చైనా సంస్థలు తాము తయారు చేస్తున్న ఫ్రక్టోజ్‌, గ్లూకోజ్‌ను భారత్‌కు ఎగుమతి చేస్తున్నట్లు బహిరంగంగానే ప్రకటించాయి. గత కొన్నేళ్లలో ఈ ఉత్పత్తులు 11వేల టన్నుల వరకు మన దేశానికి వచ్చాయి. ఈ వ్యవహారమంతా ఆన్‌లైన్‌ ఆర్డర్ల ద్వారా జరుగుతోందని, మన దేశంలో ‘ఆల్‌-పాస్‌ సిరప్‌’ పేరుతో లభిస్తుందని సీఎస్‌ఈ వివరించింది. చైనాతో పాటు ఉత్తరాఖండ్‌లోని జస్‌పుర్‌లో ఉన్న ఓ ఫ్యాక్టరీ నుంచి ఆ సిరప్‌ను సేకరించినట్లు తెలిపింది. ఈ సిరప్ కిలో రూ.53-68లకే లభిస్తోందని, పెద్ద మొత్తంలో ఆర్డరిస్తే ఇంతకన్నా తక్కువకే పొందుతున్నట్టు తమ పరిశీలనలో తేలిందని సీఎస్‌ఈ అధికారి అర్ణబ్ దత్తా అన్నారు. జర్మనీకి చెందిన ప్రపంచ ప్రముఖ ల్యాబొరేటరీలో న్యూక్లియర్‌ మ్యాగ్నెటిక్‌ రిసోనెన్స్‌ స్పెక్ట్రోస్కోపీ(ఎన్‌ఎంఆర్‌) పరీక్ష ద్వారా తేనె నమూనాలను పరిశీలించినట్లు తెలిపారు. ఎన్‌ఎంఆర్‌ టెక్నాలజీని ఉపయోగించి పరీక్షించినప్పుడు సఫోలా, మార్క్‌ఫెడ్‌సోహ్నా, నేచుర్స్ నెక్టార్ మినహా చాలా బ్రాండ్లు విఫలమయ్యాయని సీఎస్‌ఈ వెల్లడించింది.

అయితే, ఈ ఆరోపణలను దాబర్, పతంజలి, జండు సంస్థలు ఖండించడం గమనార్హం. ఎఫ్ఎస్ఎస్ఎఐ నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగానే తమ ఉత్పత్తులున్నాయని వాదిస్తున్నారు. సీఎస్ఈ విడుదల చేసిన నివేదిక అవాస్తవమైందనీ, భారత సహజసిద్ధ తేనె పరిశ్రమను దెబ్బ తీసే కుట్ర జరుగుతోందని పతంజలి సీఈవో ఆచార్య బాలకృష్ణ వ్యాఖ్యానించారు. ఈ వివాదంపై ప్రముఖ ఆయుర్వేద, హెర్బల్ ఉత్పత్తుల సంస్థ దాబర్ స్పందిస్తూ ప్రపంచంలోనే నంబర్ వన్ తేనె తమదని, ఇది 100 శాతం స్వచ్ఛమైంది, సురక్షితమైందని తెలిపింది. తమ తేనెలో కల్తీ జరగలేదని ట్విట్టర్ ద్వారా తెలిపింది.

2017-2018లో దేశంలో 1.05 లక్షల మెట్రిక్ టన్నులు తేనె ఉత్పత్తి జరిగిందని, వ్యవసాయ శాఖ పరిధిలో పనిచేసే నేషనల్ బీ బోర్డు తెల్పింది.

Related posts

Tollywood Actresses: ఈ ఫోటోలో ఉన్న చిన్నారులు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్లు.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా..?

kavya N

Iran – Israel: ఇజ్రాయెల్ సర్కార్‌ను హెచ్చరిస్తూ ఇరాన్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా ..మళ్లీ ఎప్పుడంటే..?

sharma somaraju

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju