మాట తప్పడు మడమ తిప్పడు అనే పేరు సంపాదించుకున్న జగన్ అందుకు అనుగుణంగానే అన్ని విషయాల్లోనూ నడుచుకుంటూ పరిపాలన కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం సంగతులు అలా ఉంటే.. పార్టీ పరంగా జగన్ ఇచ్చిన మాటలను నెరవేర్చ ఆలోచనలో ఉండటంలో భాగంగా… గత ఎన్నికల సమయంలో మాట ఇచ్చిన మర్రి రాజశేఖర్ ని ఎమ్మెల్సీ చేయాలని జగన్ నిర్ణయించారు! ఈ క్రమంలో ఒక కొత్త సమస్యపై చర్చలు నడుస్తున్నాయి!
అసెంబ్లీలో జగన్.. శాసనమండలి రద్దుకు సంబందించిన బిల్లును పాస్ చేయించి, హస్తినకు పంపిన సంగతి తెలిసిందే. కరోనా కారణంగా ప్రస్తుతం పార్లమెంటు సమావేశాలు జరగడంలేదు కాబట్టి ఆ బిల్లు ఆగిపోయింది! అలాకాకుండా మరికొన్ని రోజుల్లో సమావేశాలు జరిగితే.. శాసనమండలి రద్దు బిల్లుకు పార్లమెంటు ఆమోదం తెలిపితే మర్రి రాజశేఖర్ పరిస్థితి ఏమిటనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
శాసనమండలి విషయంలో దేశవ్యాప్తంగా ఒకటే రూల్ ఉండాలని కేంద్రంలోని అధికార బీజేపీ భావిస్తోందన్న వార్తల నడుమ… శాశనమండలి రద్దు బిల్లు పార్లమెంటులో పాస్ అవ్వని పక్షంలో.. ఆ దిశగా హస్తినలో రాజకీయం జరిగితే పర్లేదు కానీ… అలా కానిపక్షంలో ప్రమాణస్వీకరం చేసిన పక్షంరోజుల్లోనే మర్రి పదవి పోయే ప్రమాధం ఉంది! మరి ఈ విషయంలో జగన్ ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు.. మర్రికి ఎలాంటి న్యాయం చేయబోతున్నారు.. అనే విషయాల చుట్టూ వైకాపాలో చర్చ నడుస్తుంది!