ఏకులా వచ్చి మేకులా మారే బ్యాచ్ అన్ని పార్టీల్లోనూ ఉంటుంటారు. పైగా కొత్తగా పెట్టిన పార్టీల్లో అయితే మరీనూ! మొదట్లో పార్టీలో చోటు ఇస్తే చాలంటారు.. తర్వాత పోటీచేయడానికి సీటు ఇస్తే చాలంటారు.. అనంతరం వారికి అనిపించింది చేస్తారు! ఆ సంగతులు కాసేపు పక్కనపెడితే… ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో మరిముఖ్యంగా వైకాపాలో రఘురామకృష్ణరాజు సృష్టించిన అలజడి అంతా ఇంతా కాదు! విజయసాయి రెడ్డి ద్వారా వెళ్లిన షోకాజ్ నోటీసుల అనంతరం మరింత రెచ్చిపోయినట్లు కనిపించిన ఆయన… ఆ షోకాజ్ నోటీస్ కాగితం పట్టుకుని ఎన్నికల కమిషన్ కు, స్పీకర్ కు కంప్లైట్ చేస్తున్నాను అన్నట్లుగా ఢిల్లీ వెళ్లిన సంగతి తెలిసిందే.. అక్కడ నలుగురైదుగురు పెద్దలను కలిసిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో నిజంగా రఘురామకృష్ణం రాజు ఢిల్లీ వెళ్లి పార్టీకి ఏమైనా తలనొప్పులు తెస్తారా ఏమిటి అని వైకాపా ద్వితీయ శ్రేణి నేతలు తెగ భయపడిపోతున్నారన్ని టాక్ నడుస్తుంది. వారి వారి టెన్షన్స్ లో భాగంగా… ఎమ్మెల్యేలకు ఫోన్ లు చేయడం.. వారిలో కూడా క్లారిటీ లేనివారు మంత్రులకు ఫోన్ చేసి.. పార్టీ పరిస్థితి ఏమిటి అన్న రేంజ్ లో మాట్లాడటం జరుగుతుందట. దీత్మో రఘురామకృష్ణం రాజు వ్యవహారం పార్టీలో పెద్ద చర్చకే తావిచ్చిందని అంటున్నారు. ఈ క్రమంలో వైకాపా నేతలంతా… ఎక్కడ మళ్లీ ఎన్నికలు వస్తాయో అని తెగ చెవులు కొరుక్కుంటున్నారంట. అంతా ప్రశాంతంగా సాగుతుంది అనుకుంటున్న దశలో ఇదేమీ గోలన్నా అని అనుకుంటున్నారట.
అయితే ఈ విషయాలపై జగన్ నుంచి పరోక్ష క్లారిటీ వచ్చిందన్ని గుసగుసలు వినిపిస్తున్నాయి. రఘురామకృష్ణంరాజు విషయాలపై లైట్ తీసుకోవాలని.. ఆయన ఏమైనా అంత సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదని… ఆయన వ్యవహారంపై అల్ రెడీ ఢిలీ నుంచి నరుక్కొచ్చేపనిలోనే పార్టీ అధినాయకత్వం ఉందని పార్టీ సీనియర్ల నుంచి సీక్రెట్ క్లారిటీ వచ్చిందంట. సో.. ఒకటి రెండు రోజుల్లో రఘురామకృష్ణం రాజు వ్యవహారంపై వైకాపాలో ఒక క్లారిటీ రావొచ్చన్నమాట!