గత మూడు రోజులుగా దేశంలో వరుసగా దాదాపు 10 వేల కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదు అవుతున్న నేపథ్యంలో రాష్ట్ర రాజధాని ఢిల్లీలోని హాస్పిటల్స్ అన్నీ నిండిపోయాయి. ఢిల్లీ మహానగరంలో ఏ ఒక్క హాస్పిటల్ లో కొత్తగా పేషెంట్లు చేరేందుకు చోటు లేకపోగా ఇప్పుడు ఢిల్లీ ప్రభుత్వం హోటల్స్ లోని రూమ్స్ లో కరోనా పేషెంట్లు ఉంచాలని నిర్వహించింది.
ఇప్పటికే ప్రభుత్వాసుపత్రులతో పాటు ప్రైవేట్ ఆస్పత్రిలు అన్నీ నిండిపోగా ఇప్పుడు తక్కువ రిస్క్ ఉన్న పేషంట్ లను ఢిల్లీలోని హోటల్ రూమ్స్ లో కి షిఫ్ట్ చేయనున్నారు. ఇలా ఉండగా హోటల్ కు చెల్లించవలసిన మొత్తాన్ని ఆసుపత్రి వారు నిర్ణయిస్తారు. ఒక పేషంటు కట్టే మొత్తం ఫీజు లో నుండి నాలుగు లేదా ఐదు వేల రూపాయలు హోటల్ వారికి వెళ్తుండగా ఆ మిగిలిన మొత్తం మొత్తం ఆసుపత్రి వారికి చేరుతుంది.
ప్రస్తుతానికి ఢిల్లీలోని ఐదు ఆసుపత్రులు1000 హోటల్ రూమ్స్ ను బుక్ చేసుకోగా వచ్చే రెండు వారాల్లో మరొక 56 వేల కరోనా వైరస్ కేసులను దేశం చూడాల్సి వస్తుందని ఢిల్లీ హెల్త్ మినిస్టర్ సత్యేంద్ర జైన్ చెప్పారు.