House sale offers: కొత్తగా ఇల్లు కొనాలి అనుకుంటున్నారా… లేదా ప్రాపర్టీ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ శుభవార్త మీ కోసమే! ప్రభుత్వ రంగ బ్యాంకు పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఈ-వేలం ద్వారా చవక ధరకే ఇళ్లు, ప్రాపర్టీలు విక్రయించేందుకు రెడీ అయ్యింది. జనవరి 31న ఈ భారీ వేలం జరగనుంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ నేషనల్ వైడ్ గా ఉన్న రెసిడెన్షియల్ ఇళ్లు, ప్రాపర్టీలను ఈవేలం ద్వారా అమ్మేందుకు సిద్ధమయ్యింది. పంజాబ్ నేషనల్ బ్యాంకు ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా ప్రకటించింది. దాంతో ఇది ఒక మంచి అవకాశం అని చెప్పవచ్చు.
House sale offers : తక్కువ ధరకే ఇళ్లు..
ప్రజలు జనవరి 31న వేలంలో పాల్గొని తమకు ఇష్టమైన ప్రాపర్టీని చౌక ధరలకే సొంతం చేసుకోవచ్చు. అయితే మరిన్ని వివరాల కోసం ఐబీఏపీఐ అధికారిక వెబ్సైట్ అయిన https://ibapi.in ను సందర్శించండి. ఇక్కడ మీరు ఒక వేలానికి సంబంధించిన వివరాలతో పాటు మీ ఏరియాలో ఏ ఇళ్లు, ప్రాపర్టీలు విక్రయానికి వచ్చాయో తెలుసుకోవచ్చు.
తక్కువ ధరకే ఇళ్లు ఎందుకు వస్తున్నాయి..
ప్రముఖ బ్యాంకులు ప్రతియేటా ఈ-వేలం ద్వారా ప్రాపర్టీలు విక్రయిస్తున్నాయి. కొందరు కస్టమర్లు ప్రోపర్టీలను హామీగా పెట్టి రుణాలు తీసుకుంటారు. కానీ తిరిగి చెల్లించరు. అలాంటి వారి ప్రాపర్టీ లేదా ల్యాండ్ వంటి బ్యాంకులు జప్తు చేసి వేలం ద్వారా విక్రయించే నష్టాల నుంచి బయట పడతాయి. వేలం ద్వారా వచ్చే డబ్బులను రుణ బకాయిల కింద బ్యాంకులో జమ చేస్తుంటాయి. చచ్చిన దానికి వచ్చిందే కట్నం అన్న చందనా ఇలాంటి ఈ-వేలంలో విక్రయించే ఇళ్లు, తదితర ప్రాపర్టీలు చాలా తక్కువ ధరకే లభిస్తాయి.