సుకుమార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న తాజా చిత్రం పుష్ప. ఇక ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ – ముత్యంశెట్టి మీడియా బ్యానర్స్ కలిసి నిర్మిస్తుండగా 2021 లో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. అల్లు అర్జున్ కి జంటగా రష్మిక మందన్న నటిస్తోంది. ఇక ఈ సినిమా అల్లు అర్జున్ కి ఫస్ట్ పాన్ ఇండియన్ సినిమా. అందుకు సుకుమార్ ఈ సినిమాని భారీగా ప్లాన్ చేశాడు. ఇక ఈ సినిమా ని తెలుగుతో పాటు అల్లు అర్జున్ కి తమిళం, కన్నడ, మలయాళ, హిందీలోనూ భారీ స్థాయిలో రిలీజ్ చేయనున్నారు.
రాక్ స్టార్ దేవీశ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నాడు. ఇక మారేడుమిల్లి రంపచోడవరం ప్రాంతంలో షూటింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇంకా ఆ ప్రాంతంలో షూట్ చేయాల్సిన వర్క్ కొంత మిగిలి ఉంది. కాగా కాశీ లో కూడా ఒక సాంగ్ తీయబోతున్నట్టు సమాచారం. అయితే ఈ సినిమాలో రాక్ స్టార్ కంపోజ్ చేసే ఒక స్పెషల్ సాంగ్ కోసం బాలీవుడ్ నుంచి హాట్ బ్యూటీ ని తీసుకు రాబోతున్నట్టు ఎప్పటి నుంచి వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా ఈ స్పెషల్ సాంగ్ లో అల్లు అర్జున్ తో స్టెప్పులేయడానికి దిశా పఠానీ, ఊర్వశీ రౌతెలా లలో ఒకరిని ఫిక్స్ చేయాలని మేకర్స్ భావిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.
ఇంకా చెప్పాలంటే ఎక్కువగా ఊర్వశీ రౌతెలా పేరే ఎక్కువగా వినిపించింది.దాదాపు అందరూ తననే ఫిక్సైయ్యారు. అయితే అనూహ్యంగా ఊర్వశీ టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తోంది. సంపత్ నంది ఈ సినిమాకి కథ అందిస్తున్నాడు. బ్లాక్ రోజ్ అన్న టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతుండగా ఊర్వశీ ప్రధాన పాత్రలో నటిస్తోంది. దాంతో ఇప్పుడు కొంతమంది టాలీవుడ్ లో ఇప్పటికే హీరోయిన్ గా చేస్తున్న ఊర్వశీ .. పుష్ప లో ఐటం సాంగ్ లో ఎలా నటిస్తుందన్నట్టుగా మాట్లాడుకుంటున్నారట. మరి ఇది ఎంతవరకు నిజమో తెలీది కాని.. కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే లాంటి వాళ్ళే స్టార్ స్టేటస్ లో ఉండి .. హీరోయిన్స్ గా భారీ సినిమాలు చేస్తూ కూడా స్పెషల్ సాంగ్స్ చేస్తుంటే ఊర్వశీ ఎందుకు చేయదు అన్న మాటలు కూడా వినిపిస్తున్నాయంటున్నారు. చూడాలి మరి పుష్ప లో ఐటెం సాంగ్ లో కనిపించేదెవరో.