ఏపీ హైకోర్టు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి కొరకరాని కొయ్యలా మారిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం తీసుకుంటున్న ప్రతి ఒక్క వివాదాస్పద నిర్ణయం ప్రశ్నిస్తూ అందుకు అనుగుణంగా వారికి వ్యతిరేకంగా తీర్పులు ఇస్తూ జగన్ సర్కార్ ను కనీసం నిద్ర కూడా పోనివ్వడం లేదు. ఇదే సమయంలో ‘అందరికీ ఇళ్ళు’ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ఒక సెంటు స్థలాన్ని పేదలకు ఇస్తాము అంటూ చెప్పింది. అయితే కొన్నిచోట్ల భూములు, మైనింగ్ భూములు, స్కూల్ బిల్డింగ్స్, పశువుల మేత కోసం వేసిన భూములు, కొండలు, స్మశానాలు…. ఇలా ఎక్కడబడితే అక్కడ చట్టవిరుద్ధంగా ఇళ్ల పట్టాలు ఇవ్వడానికి సిద్ధం అయింది. ఎటువంటి బాధ్యతగా కాకుండా ఏదో ఉచ్చాము అంటే ఇచ్చాము ఉన్నట్లు వారి వైఖరి ఉంది.
ఇదే సమయంలో అలా ఆ అమరావతి రాజధాని కోసం రైతులు ఇచ్చిన భూమిని కూడా పేదలకు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. తదితర పార్టీల వారు కోర్టులో వీటన్నింటిపై కేసులు వేయడంతో ప్రతి ఒక్క విషయంలో జగన్ సర్కార్ కు ఎదురు దెబ్బ తగిలింది. అయితే వివాదంలో ఉన్న స్థలాలు మాత్రం ఆపివేసి ప్రభుత్వం చెబుతున్నట్లు మిగతా 40 వేల ఎకరాలను పేదలకు పంచవచ్చు. అయితే కోర్టు కేసుల వల్ల మొత్తం పంపిణీని ఆపివేసి.. ప్రతిపక్షాలు కోర్టు వారిని అడ్డం పెట్టుకొని పేదలకు ఇళ్ల స్థలాలను రాకుండా చేస్తున్నారని రాజకీయ పరంగా భారీ ఆరోపణలు చేస్తున్నారు.
దీంతో ఒక్కసారిగా హైకోర్టు వారికి ఒళ్ళు మండింది. తాజాగా విశాఖలోని గబ్బాడలోని చెట్లను నరికేసి ఇళ్ల స్థలాల చేస్తున్నారని గంగు నాయుడు అనే వ్యక్తి హైకోర్టును ఆశ్రయించాడు. అంతే…. చెట్ల నరికివేత పై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మీకు చెట్లు నరికేందుకు ఆదేశాలు ఎవరిచ్చారని…. ఆ ఫైలు వెంటనే తమ ముందు పెట్టాలని ఆదేశిస్తూ ఇకనుండి ఇవన్నీ ఆపివేయాలని…. మరలా ఇలాంటివి తమ దృష్టికి వస్తే మళ్ళీ ముఖ్య కార్యదర్శి బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పింది.
ఇకపోతే చెట్లు నరకడం పై సుప్రీంకోర్టు గతంలోనే అనేక ఉత్తర్వులు ఇచ్చింది అని…. చివరికి హైకోర్టు వారిని పేదలకు స్థలాలు రానివ్వకుండా చేస్తున్నారని ఆరోపణలు చేయడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. అలాగే ప్రభుత్వం…. అధికారులు ఎలాంటి పనులు చేస్తున్నారో గమనించకుండా తమపై నిందలు వేస్తున్నారని వ్యాఖ్యానించింది. ప్రభుత్వాన్ని ఉద్దేశించి హై కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ఇక ఈ కేసును మరో నాలుగు వారాలు వాయిదా వేసి జగన్ కు భారీ షాక్ ఇచ్చింది.