నందమూరి బాలకృష్ణ 100 వ చిత్రంగా వచ్చిన గౌతమీ పుత్ర శాతకర్ణి మాత్రమే అతి కొద్ది రోజుల్లో చిత్రీకరణ పూర్తి చేయగలిగారు. క్రిష్ ఈ చిత్రాన్ని భారీ తారాగణంతో తెరకెక్కించినప్పటికి 6 నేలల్లోనే రిలీజ్ చేశాడు. కాని పాన్ ఇండియన్ సినిమాలంటూ మనవాళ్ళు ఒక్కో సినిమాకి దాదాపు రెండేళ్ళు సమయం కేటాయిస్తున్నారు.
కాని ఫ్యాన్స్ మాత్రం ఒక్కో హీరో సినిమా సినిమాకి ఇంత గ్యాప్ అంటే కాస్త ఇబ్బందిగా భావిస్తున్నారు. బాహుబలి ఫ్రాంఛైజీ ముందు వరకు ప్రభాస్ నుంచి సంవత్సరానికి రెండు సినిమాలు రిలీజైయ్యేవి. కాని బాహుబలి కోసం దాదాపు నాలుగేళ్ళ పైనే సమయం కేటాయించిన ప్రభాస్ బాహుబలి ఫంక్షన్ లో ఇక
నా నుంచి సంవత్సరానికి రెండు సినిమాలు వచ్చేలా ప్లాన్ చేస్తానని..ఇకనుండి మిమ్మలిని డిసప్పాయింట్ చేయనని చెప్పుకొచ్చాడు.
కాని సాహో సినిమాకి మళ్ళీ అదే రిపీటయింది. సాహో కంప్లీటయి రిలీజ్ అయ్యేసరికి రెండేళ్ళు సమయం అలా గడిచిపోయింది. అయితే బాహుబలి సినిమా సమయంలో అభిమానులకి ప్రభాస్ ఇచ్చిన మాట ఇప్పుడు నిలబెట్టుకోబోతున్నాడని తాజా సమాచారం. ప్రస్తుతం రాధాకృష్ణ కుమార్ తెరకెక్కిస్తున్న రాధే శ్యామ్ లో ప్రభాస్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాని 2020 డిసెంబర్ వరకు చేసి 2021 ప్రధమార్థం లో రిలీజ్ చేయాలనుకుంటున్నారు.
ఇక నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఒక భారీ బడ్జెట్ సినిమా చేయబోతున్న ప్రభాస్.. బ్యాక్ టు బ్యాక్ ఒకే సంవత్సరంలో రెండు సినిమాలని రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడట. వైజయంతి మూవీస్ బ్యానర్ లో 50 వ సినిమాగా 400 కోట్ల భారీ బడ్కెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించబోతున్న సినిమాతో పాటు ఆదిపురుష్ సినిమాని ప్రభాస్ 2021 లో సెట్స్ మీదకి తీసుకెళ్ళబోతున్నారు. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కించబోతున్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా కనిపించబోతున్నాడు. ఈ సినిమా 2022 లో రిలీజ్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. ఇంతకాలం ప్రభాస్ నుంచి అభిమానులు ప్రేక్షకులు ఏదైతే కోరుకున్నారో అది 2022 లో నెరవేరబోతుందని సమాచారం.