Nagula chavithi 2022: మన దేశంలో పాములను కూడా పూజించే సంప్రదాయం మన పూర్వికుల నుంచి ఆనవయితీగా వస్తుంది. ముఖ్యంగా నాగుపామును నాగరాజుగా, నాగదేవతగా పూజిస్తారు. ఇలా పాములను పూజించే పండగానే నాగులచవితి అని అంటారు.ఈ పండగను దీపావళి అమవాస్య తర్వాత వచ్చే కార్తిక శుద్ధ చవితి నాడు చేసుకుంటారు.దీన్నే నాగుల చవితి అని అంటారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ పండగకు ఎంతో ప్రాముక్యత ఉంది.ఈ నాగుల చవితి నాడు సర్పాలను పూజిస్తే సర్వరోగాలు, వైవాహిక జీవితంలో దోషాలు, గర్భదోషాలు పోయి ఆరోగ్యవంతులవుతారని భక్తులు ఎంతగానో విశ్వసిస్తారు.
ఈ చవితి ఈ రోజు భక్తులు పూజ చేసి పాములకు నైవేద్యాలను సమర్పిస్తారు.ఈ సందర్భంగా ఈ ఏడాది నాగుల చవితి ఎప్పుడొచ్చింది ? పూజ ఎలా చేయాలి అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..పురాణాల ప్రకారం, నాగుల చవితి గురించి అనేక కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. మనకు ఎన్నో దేవాలయాల్లో నాగేంద్రుని విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయి. ఈ నాగుల చవితి రోజున నాగేంద్రుడు పరమేశ్వరుడికి వాసుకిగా, శ్రీ మహా విష్ణుమూర్తికి ఆదిశేషుగా మారి తోడుగా ఉంటాడు. అందుకే ఈ పవిత్రమైన రోజున నాగేంద్రునికి భక్తులందరూ ప్రత్యేక పూజలు చేసి నైవేద్యాలను సమర్పిస్తారు.
ఈ ఏడాది నాగుల చవితి ఎప్పుడంటే…?
ఈ ఏడాది అక్టోబర్ మాసంలో 28వ తేదీన కార్తీక శుద్ధ చవితి రోజు అనగా శుక్రవారం రోజున నాగుల చవితి పండుగ వచ్చింది.తెలుగు పంచాంగం ప్రకారం, అక్టోబర్ 28వ తేదీ శుక్రవారం తెల్లవారుజామున 4:18 గంటలకు చవితి తిథి ప్రారంభమవుతుంది. అక్టోబర్ 29వ తేదీ శనివారం తెల్లవారుజామున 5:13 గంటలకు ముగుస్తుంది. శుభ సమయం మధ్యాహ్నం 2:03 నుంచి మధ్యాహ్నం 3:43 గంటల వరకు ఉంటుంది.నాగుల చవితి రోజున ప్రత్యక్షంగా విషసర్పపుట్టలను ఆరాధించి పుట్టలో పాలు పోస్తే మానవునిలో ఉన్న విషసర్పం కూడా శ్వేతతత్వం పొంది, అందరి హృదయాలలో నివసించే శ్రీమహావిష్ణువునకు తెల్లని ఆదిశేషువుగా మారి శేషపాన్పుగా మారాలని కోరికతో చేసేదే ఈ నాగుల చవితి పండగ ఆంతర్యం.
నాగుల చవితి రోజు ఏమి చేయాలి?
నాగుల చవితి రోజు ఆవు పాలు పుట్టలో పోసి నాగపూజచేసి చలిమిడి, చిమ్మిలి ( నువ్వులతో చేస్తారు ) అరటిపళ్ళు నైవేద్యంగా పెట్టి పుట్ట దగ్గర పూజ చేసి దీపారాధన చేస్తారు. అలాగే పుట్టకు కాస్త దూరంలో” దీపావళి” నాడు మిగిలిన మతాబులు, కాకరపువ్వొత్తులు, టపాసులను కూడా కాలుస్తారు.