అమరావతి: ఏపిలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు ఏకగ్రీవం అయ్యాయి. ఖాళీ ఎర్పడిన మూడు ఎమ్మెల్సీ స్థానాలకు వైసిపి తరపున నామినేషన్లు దాఖలు చేసిన మంత్రి మోపిదేవి వెంకట రమణ, మైనార్టీ నేత మహమ్మద్ ఇక్బాల్, కర్నూలుకు చెందిన సీనియర్ నేత చల్లా రామకృష్ణరెడ్డిలు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి సోమవారం ప్రకటించారు. మహమ్మద్ ఇక్బాల్ ఎమ్మెల్సీగా దృవీకరణ పత్రం అందుకున్నారు. వైసిపికి పూర్తి స్థాయి మెజారిటీ ఉండటంతో ప్రతిపక్ష టిడిపి నుండి ఎవరినీ బరిలో నిలుపలేదు.
previous post
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?