ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న భారత క్రికెట్ జట్టు బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ లో భాగంగా నాలుగు టెస్ట్ మ్యాచ్ లను ఆడవలసి ఉంది. ఇక ఈ రోజు పూర్తయిన మొదటి టెస్టులో భారత్ ఘోర పరాభవం పొందిన విషయం తెలిసిందే. రెండో ఇన్నింగ్స్లో భారత బ్యాట్స్మెన్ కేవలం 36 పరుగులకే ఆలౌట్ కావడం ఒక్క బ్యాట్స్మన్ కూడా రెండు అంకెల స్కోర్ ను చేయలేకపోవడం గమనార్హం.
ఇప్పటికే చివరి మూడు టెస్టుల కు విరాట్ కోహ్లీ దూరం అయ్యాడు. రోహిత్ శర్మ రెండవ టెస్ట్ కి అందుబాటులో ఉండడు. స్టార్ పేసర్ ఇషాంత్ శర్మ సేవలను సిరీస్ మొత్తం భారత్ కోల్పోయింది. జడేజా ఎప్పుడు కోలుకుంటాడో తెలియదు. ఇలాంటి పరిస్థితుల మధ్య భారత్ కు మరో ఎదురు దెబ్బ తగిలింది. టీం ఇండియా స్టార్ పేస్ బౌలర్ మహ్మద్ ఎడమ చేయి విరగడంతో పూర్తి టెస్ట్ సిరీస్కు దూరమయ్యాడు.
ఈరోజు ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ ప్యాట్ కమిన్స్ బౌలింగ్ లో బౌన్సర్ ఎదుర్కొంటున్న షమీ చేతికి బంతి తగలడంతో విలవిలలాడి పోయాడు. తర్వాత ఫీల్డింగ్ కు కూడా రాలేదు. ఇక స్కాన్ చేసిన తర్వాత ఎడమ చేయి విరిగింది అని డాక్టర్లు నిర్ధారించారు. దీంతో అతను సిరీస్ మొత్తానికి దూరం అయ్యాడు. ఇక భారత్ సిరీస్ లో పుంజుకోవాలంటే పేస్ దళం అద్భుతంగా రాణించాలని ఉంది. షమీ దూరం కావడంతో బుమ్రా పెద్దగా అనుభవం లేని మహమ్మద్ సిరాజ్, నవదీప్ సైని లతో బంతిని పంచుకొనున్నాడు.
ఉమేష్ యాదవ్ మంచి బౌలర్ అయినా అతనిపై పూర్తిగా ఆశలు పెట్టుకోలేము. ఇక భారత్ వైట్ వాష్ తప్పించుకుంటే గొప్ప అని క్రికెట్ పండితులు అంచనా వేస్తున్నారు.